"ఆంధ్రా బ్యాంకు", సుప్రసిధ్ధ స్వాతంత్ర్య సమర యోధులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య మచిలీపట్నం లో స్థాపించారు. బ్యాంకు 1923 నవంబర్ 20 న రిజిస్టర్ అయింది. రూ 1.00 లక్షల మూలధనతో మరియు రూ 10.00 లక్షల అధికృత వాటా మూలధనం ( ఆధరైజ్డ్ క్యాపిటల్తో) 1923 నవంబర్ 28 వ తేదీన వ్యాపారం ప్రారంభించింది. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్ర ప్రదేశ్ లోని, పశ్చిమ గోదావరి జిల్లాలో గల గుండుగొలను అను గ్రామమునందు 24 నవంబర్ 1880 న జన్మించాడు.





ఆయన సుప్రసిధ్ధ స్వాతంత్ర్య సమర యోధులు మరియు వాసికెక్కిన వ్యక్తి.  భారత దేశపు వాణిజ్య బ్యాంకులలో ఆంధ్రా బ్యాంకు ఒకటి. ఈ బ్యాంకును 1923, నవంబరు 20 న ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భోగరాజు పట్టాభి సీతారామయ్య మచిలీపట్నంలో స్థాపించాడు. 1980లో ఈ బ్యాంకు జాతీయం చేశారు. 1981లో క్రెడిట్ కార్డు లను జారీ చేయుటం ద్వారా భారత దేశానికి క్రెడిట్ కార్డు వ్యవస్థను ఈ బ్యాంకు పరిచయం చేసింది. 2003 నాటికి నూరు శాతం కంప్యూటరీకరణ సాధించింది. 2007లో బయోమెట్రిక్ ఏటిఎంలను భారతదేశానికి పరిచయం చేసింది.






2007 సెప్టెంబర్ నాటికి ఈ బ్యాంకు 1,289 (గ్రామీణ-396, సెమి అర్బన్ -376, పట్టణ-338, మెట్రో-179) బ్రాంచీలతో 99 ఎక్స్‌టెన్షన్ శాఖలతో, 37 శాటిలైట్ ఆఫీసులతో, 505 ఏటిఎంలతో, 22 రాష్ట్రాలలో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించి ఉంది. పెట్టుబడులను రాబట్టటంలో ఈ బ్యాంకు ఆసియాలోనే ప్రథమ స్థానంలో ఉంది. భారతదేశం మొత్తంలో ఈ బ్యాంకుకు 1,30,000 షేర్‌హోల్డర్స్, 1.372 కోట్ల ఖాతాదారులు ఉన్నారు. ప్రారంభం నుండి నేటి వరకు మొత్తం ఋణాలలోకనీసం 50 శాతానికి తగ్గకుండా ఋణాలను గ్రామీణ భారతానికే అందిస్తున్నబ్యాంక్ ఇది. దేశంలో బ్యాంకుల జాతీయం చేసిన తర్వాత క్రమబద్దంగా నడుస్తున్న జాతీయ బ్యాంకులలో ఇది ప్రధానమైనది.


మరింత సమాచారం తెలుసుకోండి: