దసరా వచ్చిందంటే మార్కెట్లో ఆఫర్ల జోరు యమ హోరుగా సాగుతుంది.అక్కడున్న ప్రోడక్ట్ను బట్టి ఈ ఆఫర్స్ ఉంటాయి.ఈ సమయంలో వినియోగదారుల ఆనందాలకు హద్దే వుండదు.ఎందుకంటే దాదాపు ప్రతి షోరూంల్లో ఏదో ఒక ఆఫర్స్ లభిస్తూ ఉంటాయి.ఇక ఇప్పుడు మార్కెట్లోనే పెద్దదైన బాంటియా ఫర్నిచర్షోరూం తమకస్టమర్లకు ప్లాట్లు ఉచితం అని ప్రకటింది.
కొన్నేళ్లుగా అమలు చేస్తున్న ఆల్టో కారు,యాక్టివా స్కీములకు తోడుగా ఈ కొత్త ఆఫర్ను ప్రకటిం చింది.ఇక 69 ఏళ్ల క్రితం రాణిగంజ్ ప్రాంతంలో చిన్న షాపుగా మొదలైన బాంటియా ఫర్నిచర్స్ దినదినాభివృద్ధి చెందుతూ నేడు 4లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 షోరూములతో నగరంలోనే ప్రముఖ ఫర్నిచర్ షాపుల్లో ఒకటిగా పేరొందింది.150 ఏళ్ల క్రితమే నగరానికి వచ్చిస్థిరపడిన బాంటియా కుటుంబం 1950లో తొలిసారిగా ఫర్నిచర్ రంగంలోకి అడుగుపెట్టింది.
సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్డులో ప్రేమ్ చంద్ బాంటియా స్టీల్ ఫర్నిచర్ దుకాణాన్ని తెరిచారు.తర్వాత ఎన్నో ఆటుపొట్లు తట్టుకుని,రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఫర్నిచర్ సప్లయర్గా మారి వ్యాపారం నిలదొక్కు కున్నారు.ప్రస్తుతం ఆయన కుమారుడు సురేంద్ర బాంటియా,మనవడు అమిత్ బాంటియా ఈ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.ఇక తవద్ద ఫర్నీచర్ ఖరీదు చేసే కస్టమర్ల కోసం, వారి సంతోషం కోసం అతిపెద్ద ఆఫర్లను ప్రకటించింది.బాంటియా షోరూంలలో రూ.4.99 లక్షల విలువైన ఫర్నిచర్ కొనుగోలు చేసిన వారికి సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్,రూ.3.99 లక్షల విలువైన ఫర్నిచర్ కొనుగోలు చేసిన వారికి 100 గజాల ప్లాటు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ ఫ్లాట్స్ యాదగిరి గుట్ట సమీపంలోని దత్తాయిపల్లి గ్రామ పరిధిలో డీటీసీపీ అప్రూవ్డ్ లే–అవుట్లో నిర్ణీత రిజిస్ట్రేషన్, డెవలప్ మెంట్ చార్జీలు చెల్లించిన వారికి ఫర్నిచర్తో పాటే రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తారు.ఇకపోతే రూ.2.99 లక్షల ఫర్నిచర్ కొనుగోలు చేస్తే బీఎస్–6, 2019 మోడల్ ఆల్టో ఎల్ఎక్స్ఐ కారు, రూ.99 వేల ఫర్నిచర్ కొనుగోలుపై హోండా యాక్టివా లేదా వెస్పాను ఉచితంగా పొందవచ్చు.ఎంపిక చేసిన రిక్లైనర్ సోఫా సెట్తో పాటు రూ.55 ఇంచుల ఎల్ఈడీ టీవీని సైతం ఉచితంగా అందజేయనున్నారు.
గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి నిర్ణీత మొత్తానికి ఎంఆర్పీ ధరల్లో ఫర్నిచర్ కొనుగోలు చేసిన వారికి ఆయా ఆఫర్లు అందజేయనున్నారు.మొదటగా రూ.1 మాత్రమే చెల్లించి, మిగతామొత్తాన్ని సులభ వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నారు.నేరుగా డబ్బులు చెల్లించడం వీలుకాని వారికి పేటీఎం క్యాష్ బ్యాక్ ఆఫర్లును అదనంగా ప్రకటించారు.ఇక ఎవరికైన ఇంట్రస్ట్ ఉంటే బాంటియా షోరూంకు వచ్చి మిగతా వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు..