దీపావళి పండుగ సందర్భంగా అమెజాన్ భారీ ఆఫర్స్ ని విడుదల చేసింది. ఇక ఆఫర్స్ వివరాలు ఇలా.....అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అక్టోబర్ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సేల్ నడుస్తుంది . ప్రైమ్ కస్టమర్లకు అక్టోబర్ 12వ తేదీ మధ్యాహ్నం నుంచే ఆఫర్లు లభిస్తాయి. ఇక ఫ్లిప్‌కార్ట్ దివాలీ సేల్ 12వ తేదీన ప్రారంభమవుతోంది. అమెజాన్ సేల్స్ 13న ప్రారంభమవుతోంది. 


ఇక పేమెంట్ మనము ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు. అమెజాన్ పే ద్వారా అదనపు క్యాష్ బ్యాక్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. డెబిట్ కార్డు ద్వారా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఇవ్వబోతున్నారు. స్పెషల్ క్రెడిట్ కార్డు లిమిట్ కూడా రూ.1 లక్ష వరకు ఉంది.


దీపావళి సేల్ సందర్భంగా స్మార్ట్ ఫోన్స్ పైన 40 శాతం డిస్కౌంట్స్ ఇస్తుంది అమెజాన్. అలాగే అదనంగా ఎక్స్చేంజ్, ఫ్రీ రీప్లేస్‌మెంట్స్ ఆఫర్స్ ప్రకటించింది. OnePlus 7, redmi 7A, redmi Y3, redmi 7, samsung Galaxy M30, nokia 6.1 Plus, Honor 8X, Realme U1 వంటి స్మార్ట్ ఫోన్స్ పైన ప్రత్యేక ఆఫర్లు రిలేస్ చేసింది. ఇక అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్‌లో వివిధ ఉత్పత్తులపై 50 శాతం నుంచి 75 శాతం, అంతకుమించి ఆఫర్స్ కూడా ఉన్నాయి. మొబైల్ ఫోన్స్ పైన మాత్రమే కాకుండా ల్యాప్ టాప్స్, కెమెరాలు, స్మార్ట్ వాచీలపై కూడా భారీ డిస్కౌంట్లు ఇస్తుంది ఈ సేల్ లో.


ఇక redmi Y3 స్మార్ట్ ఫోన్ ధర రూ.8,999 కాగా ఇది రూ.7,999, redmi 7A ధర రూ.5,999 కాగా ఆఫర్ కింద రూ.4,999, redmi 7 ధర రూ.7,499 కాగా ఆఫర్ కింద రూ.6,999, samsung Galaxy M30 ధర రూ.11,000 కాగా ఆఫర్ కింద రూ.9,999, samsung Galaxy M30s ధర రూ.13,999 కాగా అమెజాన్ పే బ్యాలెనస్‌లోకి రూ.1000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇక ఫోన్ కొనాలి అనుకుంటే ఈ ఆఫర్స్ లతో తీసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: