గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అంటూ అమెజాన్, బిగ్ దీపావళి సేల్ అంటూ ఫ్లిప్‌ కార్ట్ భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో వినియోగదారులను ఆన్లైన్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు ఆకర్షించాయి. సాధారణంగా లభించే రేటు కన్నా ఆఫర్లతో అతి తక్కువ రేట్లకే గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గాడ్జెట్స్, సెల్‌ఫోన్లు లభించడంతో ప్రజలు బాగానే ఆసక్తి చూపించారు. ఆఫర్ అయిపోతుందేమోనన్న ఆత్రుతతో తమకు అవసరమైన వస్తువులను చాలానే కొనుగోలు చేశారు.

ఫెస్టివల్ సీజన్‌లో ఈ రెండు దిగ్గజ సంస్థలు 3 బిలియన్ డాలర్లు సంపాదించాయని ఈ మొత్తం ఆ సంస్థలు ఏడాదిలో జరిపే అమ్మకాల్లో 50 శాతం అని ఒక అంచనా వేస్తున్నారు. అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు కేంద్రం షాక్ ఇచ్చింది. డిస్కౌంట్లు ఇవ్వడానికి మీరెవరు అంటూ ఈ రెండు సంస్థలపై కేంద్ర వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్ ఆగ్రహం వ్యక్త పరిచారు. ఆ ఆఫర్లు దోపిడీని తలపిస్తున్నాయంటూ కాస్త గట్టిగానే ఫైర్ అయ్యారు. 


ఆఫర్లు ప్రకటించడానికి ఈ కామర్స్ సంస్థలకు ఎలాంటి అధికారం లేదు అని తెలిపారు. రిటైల్ రంగాన్ని నష్టాల్లో పడేసేలా ఉత్పత్తులు అమ్మడానికి అనుమతి లేదు అని ఆయన మీడియా పూర్వాంకంగా తెలిపారు. ఆ కంపెనీలు సొంత ఉత్పత్తులను అమ్ముకోవడానికి కూడా అధికారం లేదని వెల్లడించారు. ఈ కామర్స్ సంస్థలు కేవలం కొనుగోలుదార్లకు, అమ్మకం దార్లకు మధ్య సహాయకారి మాత్రమేనని అయన ఈ ముఖంగా తెలియచేశారు.


అయితే ఈ దిగ్గజ కంపెనీలు నిబంధనలు ఉల్లంఘించి ఉత్పత్తులను అమ్ముతున్నాయని కొంతమంది ట్రేడర్లు ఫిర్యాదు చేయడంతో వాణిజ్య మంత్రి ఈ మేరకు ఆయా సంస్థలపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఆయా సంస్థలకు నోటీసులు అందజేస్తామని తెలిపారు. ఇంతక ముందు ఈ సంస్థలను హెచ్చరించినట్లు కూడా గుర్తు చేశారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించారు కేంద్ర మంత్రి.


మరింత సమాచారం తెలుసుకోండి: