కావాల్సిన పదార్థాలు:
చేపలు- ఒక కేజీ
టమాటా- రెండు
ఉల్లిపాయలు- నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్టు- ఒకటిన్నర టీస్పూన్
ధనియాల పొడి- ఒక టీస్పూన్
పసుపు- అర టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి- నాలుగు
జీలకర్ర పొడి- ఒక టీస్పూన్
కారం- మూడు టీస్పూన్లు
ఉప్పు- రుచికి తగినంత
కొత్తిమీర- ఒక కట్ట
నూనె- సరిపడా
తయారీ విధానం: ముందుగా చేప ముక్కలను శుభ్రంగా నీటిలో కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగిన చేప ముక్కల్లో కొద్దిగా కారం, పసుపు, ఉప్పు వేసి కలియబెట్టి, అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్ తీసుకొని నూనె వేసి కాస్త వేడి అయ్యాక చేప ముక్కలు వేసుకొని కాసేపు వేగించి పక్కన పెట్టుకోవాలి. మరొకపాత్రలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మరికాసేపు వేగించాలి.
ఇప్పుడు కారం, జీలకర్రపొడి, ధనియాల పొడి వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, తగినంత ఉప్పు వేసి మరికాసేపు వేగించాలి. ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. కాసేపు తరువాత వేగించి పెట్టుకున్న చేప ముక్కలు వేసి మరికాసేపు ఉడికించాలి.
ఇక చివరిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసే సరిపోతుంది. అంతే ఎంతో టేస్టీ టేస్టీ చేపల ఇగురు రెడీ అయినట్లే. దీన్ని వేడి వేడి రైస్తో తింటే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి, ఈ లాక్డౌన్ టైమ్లో ఓ సారి మీరూ పైన చెప్పిన విధంగా చేపల ఇగురు తయారు చేసుకుని ఎంజాయ్ చేసేయండి. దీనిని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.