కావాల్సిన పదార్థాలు:
బియ్యం- రెండు కప్పులు
పైనాపిల్ ముక్కలు- ఒకటిన్నర కప్పు
నెయ్యి- నాలుగు టేబుల్ స్పూన్లు
కిస్మిస్- ఎనిమిది
అల్లం వెల్లుల్లి తరుగు- మూడు టీ స్పూన్లు
జీడిపప్పు- ఎనిమిది
కారం- ఒకటిన్నర టీ స్పూన్
పసుపు- చిటికెడు
మిరియాల పొడి- అర టీ స్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
ఉల్లిపాయ తరుగు- ఒక కప్పు
ఆయిల్- నాలుగు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి- రెండు
బీన్స్ తరుగు- అర కప్పు
నిమ్మరసం- ఒక టీ స్పూన్
కొత్తిమీర తరుగు- ఒక కప్పు
తయారీ విధానం: ముందుగా ఒక పాత్రలో బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి పలుకుగా ఉడికించుకోవాలి. రైస్ చల్లారిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని స్టౌ మీద ఉంచి వేడి చేస్తూ తగినంత నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, పండుమిర్చి, బీన్స్, క్యారెట్ తరుగు వేసి దోరగా వేగించుకోవాలి.
ఆ తర్వాత పోపు గింజలు, ఉప్పు, కూరగాయ ముక్కలు, కారం, పసుపు, పైనాపిల్ ముక్కలు వేసి పదినిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు పలుకుగా వండు కున్న అన్నం బాగా వేగిన మిశ్రమంలో కలుపి క్రింద కు దించి కిస్మిస్, కొద్దిగా పెప్పర్ పౌడర్, నిమ్మరసం, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన, సులువైన పైనాపిల్ రైస్ రెడీ అయినట్లే.
దీన్ని వేడి వేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఈ రెసిపీని ఎంతో ఇష్టంగా తింటారు. కాబట్టి, పైన చెప్పిన విధంగా పైనాపిల్ ప్రైడ్ రైస్ తయారు చేసుకుని ఎంజాయ్ చేసేయండి.