సాధారణంగా పచ్చళ్లు కూరగాయతో..ఆకు కూరలతో పెడుతుంటారు..కొంత మంది ఇష్టమైన వారు మటన్, చికెన్, చేపల తో కూడా పచ్చళ్లు చేసుకొని నిల్వ ఉంచుకొని మరీ తింటుంటారు. చేపల పచ్చడి ఎలా చేయాలో చూద్దామా..!

కావలసిన పదార్థాలు:బొమ్మె చేపలు - కిలోమంచినూనె - 250గ్రా. ఆకు కారం - 100గ్రా.ఉప్పు - 200గ్రా. ఆవాలపొడి - ఒక స్పూన్గరం మసాలా పొడి - ఒక స్పూన్నిమ్మకాయ రసం - ఒక కప్పుజీలకర్ర పొడి - అర టీ స్పూన్మెంతిపొడి - పావు టీ స్పూన్అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 50గ్రా. 


తయారు చేసే విధానం: చేపలను బాగా కడిగి నీళ్లు లేకుండా తుడిచి కాసేపు ఫ్యాన్‌గాలి కింద ఆరబెట్టాలి. ఇప్పుడు కడాయి తీసుకొని చేప ముక్కలను బంగారు రంగు వచ్చేవరకు ఒక్కొక్కటిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మళ్లీ వీటిని కాసేపు ఫ్యాన్ గాలికి ఉంచాలి. ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కారం, ఉప్పు, ఆవాలపొడి, గరం మసాలాపొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలపాలి.


నూనె, చేపముక్కలు చల్లబడిన తర్వాత కారంతో పాటు అన్నీ కలిపి ఉంచిన మిశ్రమంలో వీటిని వేసి బాగా కలుపుకోవాలి. చేపల పచ్చడి తినడానికి రెడీ! ఈ పచ్చడి తడి తగలకుండా ఉంటే సంవత్సరంపాటు నిల్వ ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: