ఫైనల్స్ కు చేరుకుంటుంది అనుకుంటే ఇండియా సెమిస్ లోనే ఇంటిబాట పట్టాల్సి వచ్చింది.  లీక్ దశలో ఓటిమి లేకుండా సూపర్బ్ గా పెర్ఫర్మ్ చేసిన ఇండియా జట్టు సెమిస్ లో ఓడిపోయింది.  ఇండియా ఓడిపోయినా... సెమిస్ లో పట్టుదలగా ఆడింది.  


5 పరుగులకే కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయినా.. రిషబ్ పంత్ ఆదుకునే ప్రయత్నం చేశాడు.  అలానే పాండే సైతం మంచి ఆటను ప్రదర్శించాడు.  ఈ ఇద్దరు ఓటయ్యే సమయానికి ఇండియా స్క్రోర్ 80 పరుగులకే 6 వికెట్లు కోల్పోయాయి.  


ఆ సమయంలో క్రీజ్ లోకి వచ్చిన ధోని, జడేజాలు వీరోచితంగా పోరాటం చేశారు.  జడేజా 79 పరుగులు చేయగా, ధోని 50 పరుగులు చేశాడు.  చివరి వరకు పోరాటం చేసినా.. చివర్లో ఇద్దరు అవుట్ కావడంతో ఇండియా జట్టు ఓటమిపాలవ్వాల్సి వచ్చింది.  


49.3 ఓటర్లలో 221 పరుగులు చేసి 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.  చాలాకాలం తరువాత న్యూజిలాండ్ జట్టు వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకోవడం విశేషం.  జడేజా, ధోనిలు చేసిన వీరోచిత పోరాటం అద్భుతంగా ఉందని మెచ్చుకుంటున్నారు ఘోరంగా ఓడిపోతుంది అనుకున్న జట్టును గెలుపు వరకు తీసుకొచ్చారు.  ఓపెనర్లు కాస్త సహకరించి ఉంటె ఇండియా తప్పకుండా ఫైనల్ కు చేరుకునేది.  


మరింత సమాచారం తెలుసుకోండి: