భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం రాత్రి జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. మ్యాచ్ జరగాల్సిన ధర్మశాల స్టేడియం పరిసరాల్లో ఉదయం నుంచి భారీ వర్షం పడటంతో సాయంత్రం వరకూ మైదానాన్ని కవర్లతో సిబ్బంది కప్పి ఉంచారు. సాయంత్రం 5.30 గంటలకి వర్షం తగ్గుముఖం పట్టడంతో మైదానాన్ని సిద్ధం చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తుండగా మళ్లీ వర్షం మొదలైంది.

దాదాపు రెండు గంటల పాటు వర్షం పడటంతో ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారిపోయింది. దీంతో మ్యాచ్ జరిగే అవకాశం లేనందున కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్‌ని రద్దు చేశారు.దక్షిణాఫ్రికా జట్టు నాలుగేళ్ల తర్వాత మళ్లీ భారత పర్యటనకి రావడంతో ఈ టీ20 సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

టీ20 రికార్డుల్లో సఫారీలపై టీమిండియాదే ఆధిపత్యంగా కనిపించినా భారత్ గడ్డపై మాత్రం ఒక్క టీ20 మ్యాచ్‌లో కూడా దక్షిణాఫ్రికా‌ని టీమిండియా ఓడించలేకపోయింది. దీంతో ఆ పేలవ రికార్డ్‌ని కనుమరుగు చేయాలని ఆశించిన కోహ్లీసేనకి వరుణుడు అడ్డుపడ్డాడు. ఇక రెండో టీ20 మ్యాచ్ మొహాలి వేదికగా బుధవారం రాత్రి 7 గంటలకి జరగనుంది. ఈ సిరీస్ గాను రెండు జట్ల టీం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

భారత టీ20 జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ షైనీదక్షిణాఫ్రికా టీ20 జట్టు: డికాక్ (కెప్టెన్, వికెట్ కీపర్), దుస్సేన్ (వైస్ కెప్టెన్), బవుమా, జూనియర్ డాలా, బోర్న్ పోర్టుయిన్, హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్, ఫెహ్లుక్వాయో, పిట్రోరియస్, కగిసో రబాడ, షంషీ, స్మట్స్.


మరింత సమాచారం తెలుసుకోండి: