తన భార్యతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడనే అనుమానంతో యువకుడిపై హత్యాయత్నం చేశాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామంలో మంగళవారం జరిగింది. విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలానికి చెందిన నిరుపేద కుటుంబం కొద్దికాలం క్రితం జె.కొత్తూరుకు వలస వెళ్లింది. భార్యాభర్తలిద్దరూ అక్కడే కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొన్నాళ్లుగా ఎదురింట్లో అద్దెకు ఉంటున్న ల్లా ఉమామహేశ్(20) అనే యువకుడితో తరుచూ తన భార్య మాట్లాడటంతో భర్తకు నచ్చలేదు.
పద్ధతి మార్చుకోవాలని భార్యకు సూచించాడు. అయితే భర్త మాట ఆమె వినలేదు. ఎప్పటిలాగే సదరు యువకుడితో మాట్లాడుతుండటంతో ఉమామహేష్పై కోపం పెంచుకున్నాడు. దీంతో ఉమామహేశ్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానం పెంచుకున్నాడు. ఎలాగైనా అంతం చేయాలని భావించాడు. మంగళవారం తన భార్యతో ఉమామహేష్ మాట్లాడటం చూసిన ఆ వ్యక్తి కోపోద్రిక్తుడయ్యాడు. కత్తితో మహేశ్పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాలపాలైన ఉమామహేష్ కేకలు వేస్తూ వీధుల్లోకి పరుగెత్తాడు.
రక్తమోడుతున్న యువకుడిని వెంటనే స్థానికులు కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జగ్గంపేట పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈసంఘటన స్థానికంగా సంచలనం రేపింది. ప్రజలంతా కరోనా భయంతో వణికిపోతున్న వేళ ఈ సంఘటన చోటు చేసుకోవడంతో చర్చనీయాశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడి బంధువులు ఆందోళనకు దిగిన పోలీసులు సర్దిచెప్పడంతో శాంతించారు. యువకుడికి ప్రాణాపాయం లేదని వైద్యులు తేల్చిచెప్పారు. హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/
Apple : https://tinyurl.com/NIHWNapple