అమ్మాయిలు, ఆంటీలే టార్గెట్గా పెట్టుకుని సోషల్ మీడియాలో వారికి వలవేస్తూ విచ్చలవిడి తనానికి అలవాటు పడిన ఓ కామాంధుడు అయిన యువకుడి గుట్టు రట్టయ్యింది. చెన్నైకు చెందిన కాశీ అలియాస్ సుజి అలియాస్ సుక్కు అలియాస్ బాబు (26) సోషల్ మీడియా టార్గెట్గా చేసుకుని ఇప్పటి వరకు 100 మంది అమ్మాయిలను మోసం చేశాడు. వీరిలో 10 మంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేయగా విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
చివరకు ఇతడి బుట్టలో చెన్నైకు చెందిన ఓ ప్రముఖ లేడీ డాక్టర్ పడింది. ఆమెను సైతం ఆ కామాంధుడు మోసం చేయడంతో ఆమె చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కాశీపై కేసు నమోదు చేశారు. అమ్మాయిలు, ఆంటీలను మోసం చేశానని స్వయంగా కాశీ పోలీసుల విచారణలో అంగీకరించాడు. నాగర్ కోవిల్ ప్రాంతానికి చెందిన ఓ వివాహిత మహిళను మోసం చేసిన కాశీ... అదే ప్రాంతానికి చెందిన ఎంతో మంది అమ్మాయిలకు మాయమాటలు చెప్పి వారిని లోబరచుకున్నట్టు విచారణలో తేలింది.
ముందుగా పెళ్లియన వివాహితలను నమ్మించి బుట్టలో వేసుకుని ఆ తర్వాత రహస్యంగా తీసిన నగ్న వీడియోలు, ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి వారి దగ్గర నుంచి రు. లక్షల్లో సొమ్ము వసూలు చేయడం.. డబ్బులు లేవంటే వారి వద్ద నున్న బంగారు ఆభరణాలు లేదా వెండి ఆభరణాలు తీసుకుంటాడని పోలీసుల విచారణలో తేలింది. కాశీపై పోలీసులు గుండా చట్టంతో పాటు అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసినందుకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
కాశీ ప్రతిరోజు జిమ్కు వెళ్లి కండలు పెంచడం.. వాటిని ఫేస్బుక్లో పెట్టి అమ్మాయిలకు వలవేసి.. వారిని తనమాయ మాటలతో లోబచరుకోవడం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మొత్తం 100 మంది అందమైన అమ్మాయిలు, ఆంటీలను అతడు మోసం చేసినట్టు తెలుస్తోంది.