ఆ యువ‌తీ, యువ‌కుడు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుని క‌లిసి జీవించాల‌ని అనుకున్నారు. అయితే వారిద్ద‌రి సామాజిక వ‌ర్గాలు వేర్వేరు కావ‌డంతో ఇంట్లో వాళ్లు ఒప్పుకోర‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఈ టైంలోనే యువ‌తికి మ‌రో యువ‌కుడితో పెళ్లి ఫిక్స్ చేశారు. దీంతో జీవితాంతం క‌లిసి ఉండాల‌న్న త‌మ కోరిక నెర‌వేర‌ద‌ని నిర్ణ‌యించుకున్న ఈ జంట ఇక క‌లిసి చ‌నిపోవాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చారు. చివ‌ర‌కు వీరి ప్రేమ‌కు కులం గోడ‌లు అడ్డు రావ‌డంతో చివ‌ర‌కు వీరు త‌మ మొడ‌ల‌కు ఉరి బిగించుకుని త‌మ జీవితాన్ని ముగించేసుకున్నారు. ఈ సంఘ‌ట‌న అనంత‌పురం జిల్లాలోని ఉర‌వ‌కొండ మండలం కౌకుంట్లలో జ‌రిగింది. పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

 

కౌకుంట్ల‌కు చెందిన సోమశేఖర్‌ కూతురు సుస్మిత(20), కణేకల్లు మండలం తుంబిగనూరు గ్రామానికి చెందిన రామన్న కొడుకు రవి (25) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ర‌వి గొర్రెల కాప‌రిగా ప‌ని చేస్తున్నాడు. వీరిద్ద‌రు ప్రేమించుకున్నా వీరి కులాలు వేరు కావ‌డంతో వీరు త‌మ ప్రేమ‌కు పెద్ద‌లు అంగీక‌రించ‌ర‌న్న ఆందోళ‌న‌తో ఉన్నారు. ఈ క్ర‌మంలోను సుశ్మిత‌కు మ‌రో యువ‌కుడితో కొద్ది రోజుల క్రిత‌మే పెళ్లి నిశ్చ‌యించారు. దీంతో పెళ్లికి త‌మ పెద్దలు ఒప్పుకోరి నిర్ణ‌యించుక‌న్న వీరు ఆదివారం ర‌వి బంధువుల ఇంట్లో ఒకే ఉరితాడుకు ఉరేసుకున్నారు.

 

ఈ ఇద్ద‌రు ఇళ్ల‌ల్లో వారు అంద‌రూ ప‌నుల‌కు వెళ్ల‌డంతో దీనిని ఎవ్వ‌రూ గ‌మ‌నించ లేదు. అయితే ఓ యువ‌కుడు వీరు ఉరితాడుకు వేలాడ‌తున్న విష‌యం చూసి స్థానికుల‌కు స‌మాచారం ఇవ్వ‌గా పోలీసులు వెళ్లి చూడ‌గా అప్పటికే రవి, సుస్మిత చనిపోయారు. ఉరవకొండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అక్క‌డ విష‌పు గుళిక‌లు ఉండ‌డంతో ముందు వీరు గుళిక‌లు తిని ఆ త‌ర్వాత ఉరేసుకున్నార‌ని భావించారు. ఇక సుశ్మిత త‌ల్లిదండ్రుల‌కు ఏకైక కుమార్తె కావ‌డంతో ఆమె తల్లిదండ్రుల‌ను ఓదార్చ‌డం ఎవ్వ‌రి త‌రం కాలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: