కరోనా లాక్డౌన్ నుండి కేంద్ర మినహాయింపులు ఇస్తూ దేశంలోని అన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మూడో విడత లాక్ డౌన్లో భాగంగా దేశవ్యాప్తంగా మద్యం షాపులు తెరుచుకోవడంతో మందు బాబుల ఆనందానికి హద్దే లేకుండా పోతోంది. దాదాపు 40 రోజులుగా తరువాత మద్యం అభిస్తుండటంతో మద్యం షాపుల వద్ద పండగ వాతావరణం నెలకొంది. అయితే మరోవైపు ఈ మద్యం షాపులు తెరుచుకోవడం వల్ల కొన్ని దారుణాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా మద్యానికి డబ్బులు ఇవ్వలేదని గర్భిణీ భార్యను దారుణంగా చంపాడు భర్త.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని జవున్పూర్ జిల్లాలో ఉన్న భాతోలీ గ్రామంలో దీపక్ సింగ్, నేహ దంపతులు నివాసం ఉంటుంది. ఈ దంపతులకు 4 ఏళ్ల పిల్లాడు ఉండగా.. నేహ ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణీ. ఇక లాక్డౌన్ కారణంగా 42 రోజుల కిందట మూసేసిన మద్యం షాపుల్ని మళ్లీ తెరవడంతో డబ్బులు కోసం ఇళ్లంతా వెతికాడు దీపక్ సింగ్. కానీ, ఎక్కడా డబ్బులు కనిపించలేదు. దీంతో భార్య దగ్గర డబ్బు ఉందని తెలుసుకున్న దీపక్.. అడగగా ఆమె నిరాకరించింది. నన్ను డబ్బు అడగొద్దు.. ఇంట్లోంచీ కాలు బయటపెట్టొద్దు అంటూ నేహ భర్తపై ఆగ్రహించింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాట మాట పెరిగి.. గొడవ తీవ్ర స్థాయికి చేరింది.
దీంతో దీపక్కి పిచ్చి కోపం వచ్చింది. ఆవేశంలో దీపక్ పక్క గదిలోకి వెళ్లి సొరుగులో దాచిన దేశవాళీ తుపాకీ తెచ్చి భార్యను కల్చేశాడు. ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. అది చూసిన నాలుగేళ్ల పిల్లవాడు భయంతో బయటకు పారిపోయాడు. ఇక తూపాకీ శబ్దం విన్న స్థానికులు ఇంట్లోకి వచ్చి చూసేసరికి దీపక్ పరార్ అయ్యాడు. మరోవైపు దారుణ స్థితిలో నేహను చూసిన స్థానికులు.. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె చనిపోయింది. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో.. కేసులు నమోదు చేసి.. దీపక్ను పట్టుకున్నారు. మరియు పిల్లాడిని కూడా కనిపెట్టి వారి బంధువులకు అప్పగించారు. ఇలా మద్యం కారణంగా ఆ కుటుంబం ఇప్పుడు చిన్న భిన్నం అయింది.