ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ మ‌హ‌మ్మారి ధాటికి అటు ప్ర‌జ‌లు, ఇటు ప్ర‌భుత్వాలు అత‌లాకుత‌లం అవుతున్నాయి. అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ  చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. అత్యాచారాలు అరికట్టేందుకు ఎన్ని చట్టాలు వస్తున్నా కామాంధుల అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. ఎన్ని క‌ఠ‌న చ‌ర్య‌లు చేప‌డుతున్నా.. అవేమి పట్టించుకోని కొంతమంది మృగాళ్లు తమపని తాము చేసుకుపోతున్నారు. ప్రభుత్వాలు , ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నా... మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు.

 

ఆడ‌ది క‌న‌ప‌డితే చాలు.. కామ‌వాంఛ తీర్చుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటున్నారు.  బంధాలు అనుబంధాలకు విలువ లేకుండా ప్రవర్తిస్తున్నారు. చిన్నారులు, మహిళలపై దాడుల నిరోధానికి ఇప్పటికే పోక్సో చట్టం అమలులో ఉండగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకువచ్చింది. అయిన‌ప్ప‌టికీ ఆడ‌వారిపై కొంద‌రు మృగాల కన్నా హీనంగా ప్రవర్తించి తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. తాజాగా ఓ అత్తపై క‌న్నేసి పొట్ట‌న‌పెట్టుకున్నాడు ఓ నీచ‌పు అల్లుడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌లోని లాతేహర్ జిల్లాలో ససంగ్ గ్రామానికి చెందిన కాలా భుయాన్ అత్తతో లైంగిక సంబంధం పెట్టుకోవాలనుకున్నాడు. అత్త, అల్లుడు ఇద్దరూ ఇరుగు పొరుగు ఇళ్లలోనే ఉంటారు. అయితే మంగళవారం ఉదయం అత్త ఇంట్లోకి వెళ్లిన‌ అల్లుడు ఆమె ఒంటరిగా ఉన్న టైమ్ చూసి అఘాయిత్యానికి ఒడిగట్టబోయాడు. 

 

కానీ, ఆమె నిరాకరించ‌డంతో పాటు అత‌డిపై తిరగబడింది. అయితే కామ వాంఛ తీర్చనందుకు ఆ నీచుడు ఏకంగా ఆమె ప్రాణాలే తీసేశాడు. అనంతరం ఏమీ తెలియనట్టు మళ్లీ ఇంటికి వచ్చేశాడు. ఇక కొన్ని గంట‌ల త‌ర్వాత దారుణంగా శ‌వ‌మై క‌నిపించిన ఆమెను స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. ఆమెను హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించ‌గా.. వైద్యులు అప్ప‌టికే మ‌ర‌ణించింద‌ని తేల్చారు. ఇర కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు..  క్లూస్ టీమ్‌ను పిలిపించి విచారించగా, అసలు విషయం బ‌య‌ట ప‌డింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: