అత్యాచారాలు అరికట్టేందుకు ఎన్ని చట్టాలు వస్తున్నా కామాంధుల అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయే తప్పా.. తరగడం లేదు. ప్రభుత్వాలు , ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నా... మరోవైపు మాత్రం అవేమి పట్టించుకోని కొంతమంది మృగాళ్లు తమపని తాము చేసుకుపోతున్నారు. ఆడది కనిపిస్తే.. కామవాంఛ తీర్చుకోవమే పనిగా పెట్టుకుంటున్నారు. చిన్నా.. పెద్దా, వావి వరస అని తేడా లేకుండా మనుషులు మృగాలుగా మారి ప్రవర్తిస్తున్నారు. ఇక తాజాగా ఓ దొంగబాబా వివాహితురాలిపై అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్లోని బార్మెర్ జిల్లాలోని ధోరిమన్న ప్రాంతంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ధోరిమన్న ప్రాంతంలోని ఒక గ్రామానికి చెందిన వివాహితురాలు గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. అయితే చికిత్స కోసం బాబా వద్దకు వెళ్ళింది. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న దొంగబాబా ఆమెలో దెయ్యం ఉందని, ఆత్మను ఆమె శరీరం నుండి తొలగించాల్సి ఉంటుందని మహిళ కుటుంబాన్ని నమ్మించాడు. ఇందుకోసం దొంగబాబా సదరు మహిళ భర్తను ఓ పని చేయమని చెప్పాడు. మహిళను తీసుకొని సమీపంలోని శ్మశానవాటికకు తీసుకొచ్చి కిలో మీటరు దూరంలో వేచి ఉండాలని, అప్పుడు తాను తంత్ర విద్యలతో ఆమె శరీరంలోని ఆత్మను తొలగిస్తానని అన్నాడు.
ఆ బాబా మాటలను సదరు కుటుంబం గుడ్డిగా నమ్మేసింది. దీంతో భర్త భార్యను తీసుకొని స్మశాన వాటికలో విడిచిపెట్టి.. అక్కడి నుంచి కిలో మీటరు దూరం వెళ్లిపోయాడు. అతను వెళ్లగానే ఆ దొంగబాబా ఎంటర్ అయ్యి.. ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. దీంతో ఆ మహిళ ప్రతిఘటించి.. ఎలాగోలా అతడి బారి నుంచి పారిపోయింది. అనంతరం భర్తకు అసలు విషయం చెప్పింది. దీంతో ఆమె భర్త వెంటనే బాబాను పట్టుకుని పోలీసులకు అప్పగించి.. అసలు విషయం చెప్పాడు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరియు మహిళకు వైద్య పరీక్షలు ప్రారంభించారు.