నేటి సమాజంలో ఆడవారికి ఇంటా, బయట కూడా రక్షణ లేకుండా పోతోంది. పది నెలల పసిపాప నుండి కాటికి కాళ్ళు చాపుకున్న పండు ముదుసలి వరకు.. ఇలా ఎవ్వరిని కామాంధులు వదిలిపెట్టడం లేదు. బలవంతంగా వారి కోర్కెలు తీర్చుకుంటున్నారు. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. పోలీస్ వ్యవస్థ ఎంత పటిష్టంగా కాపలా కాస్తున్నా.. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు ఎక్కడో ఓ చోట దారుణాలకు ఒడిగడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే రోజురోజుకు చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు గణనీయంగా పెరుగుతున్నాయి.
కామోద్రేకంతో ఆడవారి మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మహిళలను దైవంగా కొలిచే దేశంలో వారిపై లైంగిక దాడులు, దౌర్జన్యాలు, హింస నిత్యకృత్యమయ్యాయి. పోలీసులున్నారు.. చట్టాలున్నాయి.. కానీ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా అక్క కూతురుపైనే అత్యాచారం చేశాడు ఓ నీచపు మేనమామ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్లో అహ్మదాబాద్ పరిధిలో మేఘానినగర్కు చెందిన ఓ దంపతులకు 16 ఏళ్ల కుమార్తె ఉంది. అయితే బాలికకు మేనమామ వరసయ్యే 24 సంవత్సరాల యువకుడు అక్క బావతో కలిసి ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి నీచపు ఆలోచనతో అక్క కూతురుపైనే కన్నేశాడు.
బాలికపై ఎలాగైనా తన కామవాంఛ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇంతలోనే ఒక రోజు తన అక్క బావ పనిమీద బయటకు వెళ్లారు. అదే టైమ్ను అదునుగా చూసుకున్న సదరు వ్యక్తి.. ఒంటరిగా ఉన్న బాలికకు కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక మెలకువ వచ్చిన తర్వాత ఈ విషయం ఎవరితోనూ చెప్పవద్దని.. ఒక వేళ చెబితే చంపేస్తానని తీవ్రంగా బెదిరించాడు. అయినప్పటికీ బాధితురాలు ధైర్యం చేసి తల్లి రాగానే విషయం మొత్తం బయటపెట్టింది. కూతురు మాటలకు షాక్ అయిన తల్లి వెంటనే విషయాన్ని భర్తకు చెప్పి పోలీసులకు ఆశ్రయించారు. ఇక కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.