అందమైన కాలేజ్ అమ్మాయిలను లొంగదీసుకుని వారికి కూల్ డ్రింక్స్లో మత్తు మందు కలిపి వారి నగ్న వీడియోలు తీస్తూ వారిని వ్యభిచారం కూపంలోకి దింపుతోన్న.. వారి వీడియోలు అమ్ముకుంటోన్న గ్యాంగ్ గుట్టును మధురై పోలీసులు రట్టు చేశారు. ఓ హైటెక్ వ్యభిచార దందా వెనక ఓ మొబైల్ షాప్ యజమాని, హైటెక్ రెస్టారెంట్ ఓనర్ ఉన్నారట. మధురై కాలేజ్లో ఓ ప్రముఖ కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ విద్యార్థినులు మొబైల్ షాప్లో రీజార్జ్కు వెళ్లేవారు. ఆ షాపు యజమాని, మరో రెస్టారెంట్ ఓనర్ కలిసి వాళ్ల ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి ట్రాప్ చేయడం మొదలు పెట్టారు. మేం చెప్పినట్టు వింటే మీకు కావాల్సినంత డబ్బులు ఇస్తామని ఆశ పెట్టారు. మీరు లగ్జరీ లైఫ్ గడప వచ్చని చెప్పారు.
గత కొంత కాలంగా ఈ తంతు నడుస్తోంది. చివరకు ఓ విద్యార్థిని ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు ఆ కాలేజ్ విద్యార్థినిలపై మాటు వేసి ఉంచారు. ఒక్క ఫోన్ నెంబర్ ఆధారంగా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాక్ డౌన్ వేళ పదే పదే అమ్మాయిలు హాస్టల్, కాలేజ్ నంచి బయటకు వెళ్లి వస్తున్నారు. దీంతో పోలీసులు ఆరా తీయగా అసలు విషయం బయట పడింది.
ఇక ఈ వలలో పడిన కొందరు అమ్మాయిలు ఇప్పటికే సర్వస్వం కోల్పోయారట. వలలో పడిన అమ్మాయిలను రెస్టారెంట్లు.. విహార యాత్రలు అంటూ తీసుకు వెళ్లి వారి చేతి ఖర్చులకు వేలాది రూపాయలు ఇచ్చి తర్వాత వారితో కామ వాచంలు తీర్చుకుని వీడియోలు తీస్తూ బ్లాక్ మెయిల్ చేయడమో లేదా వారిని వ్యభిచార కూపంలోకి దించడమో చేస్తున్నారు.ఇక పోలీసులు ఈ ముఠా వెనక ఎవరెవరు ఉన్నారు ? అసలు వీరు ఎంత మంది అమ్మాయిలను ఈ ఊబిలోకి దింపారన్న దానిపై విచారణ చేస్తున్నారు.