నేటి స‌మాజంలో అక్ర‌మ సంబంధాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ అక్ర‌మ సంబంధాల వ‌ల్ల ఎన్నో కుటుంబాలు చిన్నా‌భిన్నం కూడా అవుతున్నాయి. ఆడ,మగ అనే తేడా లేకుండా అక్రమ సంబంధాలు చేసుకుంటూ అడ్డంగా దొరుకుతున్నారు. వీటి వల్ల హత్యలు, ఆత్మహత్యలు కూడ వీపరీతంగా పెరుగుతున్నాయి. మ‌రియు ఈ అక్ర‌మ‌ సంబంధాలు పచ్చని కాపురాలను కకావికలం చేస్తున్నాయి. అయితే తాజాగా అక్ర‌మ సంబంధం ఓ యువ‌కుడి ప్రాణాలు బ‌లితీసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రామాద్ మండలం మన్ననూర్‌లో ఆంజనేయులు అనే యువ‌కుడు అదే గ్రామానికి చెందిన బాలమణి అనే మహిళతో రెండేళ్లుగా విహాహేతర‌ సంబంధం కొనసాగుతోంది. 

 

ఈ విషయం ఇంట్లో తెలియడంతో గ్రామ పెద్దలు ఆంజ‌నేయుల‌ను, బాల‌మ‌ణిని మంద‌లించారు. ఇక వెంట‌నే ఆంజనేయులు మామ శ్రీనివాస్.. తన కూతురినిచ్చి అతడికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. అందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. అయితే ఈ విష‌యాన్ని బాల‌మ‌ణికి చెప్పాల‌ని గ‌త వారం  ఆంజ‌నేయుల వాళ్ల ఇంటికి వెళ్లాడు. అనుకున్న‌ట్టుగానే బాల‌మ‌ణికి విష‌యం చెప్పాడు. దీంతో ఆగ్ర‌హించిన ఆమె ఆంజ‌నేయులపై విరుచుకుప‌డింది. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రి మ‌ధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదంలోనే ఆంజనేయులు గొంతుకోసి చంపేసింది బాలమణి. 

 

అతడు మరణించాడని నిర్ధారించుకున్నాక మృతదేహాన్ని దారుణంగా గోనె సంచిలో కట్టి మ‌రీ ఇంటి సమీపంలోని డ్రైనేజీలో పడేసింది. ఆంజ‌నేయులు ఇంటికి రాక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు ఊరంతా వెతికి.. చివ‌ర‌కు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఇక కేసుల న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తుండ‌గా.. మన్ననూర్ ఎస్‌బీఐ ఎదుట ఉన్న మురుగు కాల్వ నుంచి దుర్వాసన వ‌స్తుంద‌ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ ప్ర‌దేశాన్ని పరిశీలించగా ఓ సంచిలో ఆంజనేయులు మృతదేహం లభ్యమైంది. ఈ క్ర‌మంలోనే కుటుంబ స‌భ్యులు అందించిన వివ‌రాలు మేర‌కు పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగించ‌గా.. బాల‌మ‌ణి హంత‌కురాలు అని తేలింది. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: