నేటి స‌మాజంలో స్త్రీకి ఇంటా, బ‌య‌ట కూడా ర‌క్ష‌ణి లేకుండా పోతోంది.  అర్ధరాత్రి స్త్రీలు స్వేచ్ఛగా సంచరించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం అని మహాత్మాగాంధీ చెప్పాడు. మహాత్ముడు అర్థరాత్రి అన్నాడు. కానీ పట్టపగలే తిరగలేని పరిస్థితి దాపురించింది. పరాయి స్త్రీని మాతృమూర్తితో సమానంగా గౌరవించే సంస్కృతికి పెట్టింది పేరైన భరతగడ్డపై నేడు ఆ మహిళలకే భద్రత కరువయ్యింది. కామంతో క‌ళ్లు మూసుకుపోయిన కొంద‌రు కామాంధులు.. ఆడ‌ది క‌నిపిస్తే చాలు.. కాటేస్తున్నారు. ఎంద‌రో పోలీసులున్నారు. ఎన్నో చట్టాలున్నాయి. కానీ నేరాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. 

 

తాజాగా కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సిన క‌న్న కూతురిపైనే ఓ నీచ‌పు తండ్రి దారుణంగా త‌న కామ‌వాంఛ‌ను తీర్చుకున్నాడు. ఇక ఈ నీచుడికి భార్య స‌హ‌క‌రించ‌డం గ‌మ‌నార్హం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశలో 18 ఏళ్ల బాలికను కన్న తండ్రే అత్యాచారం చేశాడు. లాక్‌డౌన్‌ సమయంలో మార్చి 26న కూతురు కిచెన్‌లో ఉంటే.. తండ్రి బెడ్‌రూమ్‌లోకి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. తల్లి కూడా భర్తకే స‌పోర్ట్ చేసింది. ఈ క్ర‌మంలోనే కూతురు కేకలు పెట్టకుండా కూతురి నోట్లో గుడ్డలు కుక్కి నోరు కట్టేసింది. 

 

మ‌రియు కూతురిని మంచానికి కట్టేసి అమానుషంగా అత్యాచారం చేస్తుంటే మౌనంగా చూస్తూ నిల్చుండిపోయింది. దీంతో బాధితురాలు ఇంటి నుంచి తప్పించుకొని బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి బంధువుల ఇంటి నుంచి ఆమెను తీసుకెళ్లి, ఏప్రిల్‌ 10న మరోసారి రేప్‌ చేశాడు. దీంతో చివరికి అక్క సాయంతో పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణ ఘ‌ట‌న‌ వెలుగులోకి వచ్చింది. పోలీసులు బాధితురాలు ఇంటికి వెళ్ల‌గా.. స‌ద‌రు త‌ల్లిదండ్రులు కూతురిది క‌ట్టుక‌థ అని న‌మ్మించ‌సాగారు. ఇంత‌లో బాధితురాలు చెంపలపై కొరికిన గాయాలను పోలీసులకు చూపించి విష‌యం బ‌య‌ట‌పెట్టింది. దీంతో కేసు న‌మోదు చేసిన పోలీసులు బాధితురాలి తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: