అక్రమ సంబంధాలు.. నేటి కాలంలో ఇవి రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ అక్రమ సంబంధాల వల్ల ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి. భార్యా భర్తలు విడిపోయి పండంటి కాపురంను కూల్చుకుంటున్నారు. ఫలితంగా పిల్లలు అనాథలవుతున్నారు. అక్రమ సంబంధాల వల్ల ప్రాణాలు తీసుకున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. అయిప్పటికీ ఇలాంటి వారిలో మార్పు రావడం లేదు. కేవలం పది నిమిషాల సుఖం కోసం బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కుటుంబాన్ని రోడ్డున పాడేస్తున్నారు. ఇక కొందరైతే.. వావి వరసలు మరచి దారుణంగా ప్రవర్తిస్తున్నారు.
తాజాగా కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ నీచపు మామ.. అడ్డుగా ఉన్న కొడుకునే హతమార్చాలనుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ లో ఓ వ్యక్తికి భార్య, కుమారుడు ఉన్నారు. అయితే ఇటీవల భార్య చనిపోవడంతో తండ్రీకొడుకు ఒంటరిగా ఉంటున్నారు. అయితే గతేడాది కొడుకు ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇక భార్య చనిపోయినప్పటి నుంచి లైంగిక సుఖానికి పరితపించేవాడు. కొడుకు వ్యాపారం నిమిత్తం బయటికి వెలుతుండడంతో ఇంట్లో మామ, కోడలు మాత్రమే ఉండేవారు. దీంతో అతడి కన్ను కోడలిపై పడింది. ఈ క్రమంలోనే కోడలిని లొంగదీసుకోవాలని డిసైడ్ అయ్యాడు.
ఈ క్రమంలోనే కొడుకు లేని టైమ్లో కోడలితో సన్నిహితంగా ఉండేవాడు. మాటల సందర్భంలో తన కోరికను తెలియజేశాడు. మామయ్య తన పై ఆశ పడుతున్నాడని తెలుసుకున్న కోడలు తొలుత భయపడింది. అప్పటి నుంచి అతనికి దూరంగా ఉండసాగింది. అయినప్పటికీ కోడలిని మాత్రం మామ వదల్లేదు. మెల్లగా కోడలిని ముగ్గులోకి దింపాడు. ఇక కొడుకు ఇంట్లో నుంచి బయటికి వెళ్లడమే ఆలస్యం.. వెంటనే తలుపులు వేసుకుని మామకోడలు ఇద్దరూ గదిలోకి దూరి కామక్రీడల్లో మునిగితేలేవారు. ఇలా కొన్నాళ్ల వారి బాగోతం గుట్టుగా సాగింది. అయితే ఈ విషయం కుమారుడికి తెలియడంతో.. ఇద్దరినీ హెచ్చరించాడు.
అయినప్పటికీ వాళ్లలో ఏ మాత్రం మార్పు కనిపించలేదు. దీంతో వారికి చెప్పి విసిగిపోయిన కొడుకు.. తాను వేరు కాపురం పెడతానని చెప్పాడు. అప్పుడు తండ్రి ఆందోళన చెందాడు. కొడుకు వేరు కాపురం పెడితే.. కోడలితో తన కామ కోరికలు తీర్చుకోవడానికి వీలుండదని భావించాడు. కొడలికి తనకి మధ్య తన కొడుకు అడ్డుగా ఉన్నాడని.. అతడిని చంపేస్తే.. ఎలాంటి అడ్డు ఉండదని డిసైడ్ అయ్యాడు. అయితే తండ్రి ప్లాన్ను తెలుసుకున్న కొడుకు తెలివిగా తప్పించుకున్నాడు. అనంతరం పోలీసులకు విషయం చెప్పి.. నీచపు తండ్రిని అరెస్ట్ చేయించాడు.