నేటి స‌మాజంలో ఆడ‌పిల్ల‌కు ఇంటా, బ‌య‌ట కూడా ర‌క్ష‌ణ లేకుండా పోతోంది. మగవాడికి ప్రాధ్యాన్యతనివ్వడం ఎప్పుడు ఎలా మొదలయిందో తెలీదు కానీ, ఆడపిల్లని సామాజికంగా, సాంస్కృతికంగా త‌క్కువ‌గా భావిస్తూ ఉండడం మనం దాదాపు ప్రతి ఇంటా చూస్తున్నదే. ఆడపిల్లకు జన్మనిచ్చి వేలూ, లక్షలూ ఖర్చు చేసే బదులు గర్భస్థ దశలోనే వెయ్యో రెండువేలో ఖర్చు చేసి వదిలించు కోవడం ఉత్తమం అనుకుంటున్నారు కొందరు. ఇక ఎలాగోలా ఇలాంటి నీచ‌పు ఆలోచ‌న‌ల నుంచి ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌పడుతున్నా.. స‌మాజంలో ఆడ‌పిల్ల‌ల‌పై రోజు రోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి.

 

నిర్భయ చట్టం లాంటి కఠిన చట్టాలు ఎన్ని వచ్చినా ఆడపిల్లలకు, మహిళలకు, ఉద్యోగినులకు రక్షణ లేకుండా పోతోంది. అమ్మాయిలు నిర్భయంగా తిరగాలని ప్రభుత్వాలు భావిస్తే.. నేరస్తులు నిర్భయంగా, నిర్లజ్జగా తిరిగేస్తున్నారు. ఇక తాజాగా ప్రేమించిన ప్రియురాలిని అతి దారుణంగా బ‌లితీసుకున్నాడు ఓ ప్రియుడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని కంజావాలా జిల్లాకు చెందిన వ్యక్తి, ఓ యువతి లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాడు. ఇక‌ వీరిద్దరూ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో పని చేస్తూ జీవనం కొన‌సాగిస్తున్నారు.

 

అయితే ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేవాల‌ను క‌రోనా వైర‌స్ తీవ్ర స్థాయిలో భ‌య‌పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే క‌రోనాని క‌ట్ట‌డి చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం భార‌త్‌లోనూ లాక్‌డౌన్ విధించింది. ప్ర‌స్తుతం భార‌త్‌లో మూడో ద‌శ లాక్‌డౌన్ అమ‌ల‌వుతోంది. దీంతో స‌ద‌రు ప్రేమికులు ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. అయితే ఈ శుక్రవారం ఏమైందో తెలియ‌దుగాని.. తన ప్రియురాలిని అతి కిరాతకంగా హత్య చేశాడు. అంతేకాదు.. శవాన్ని న‌గ్నంగా దాదాపు ఐదు గంటలపాటు పక్కనే పెట్టుకొని పడుకోవడం గమనార్హం. ఇది గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో పోలీసులు అక్క‌డికి చేరుకుని.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మ‌రియు శ‌వాన్ని పోస్ట్‌మార్టంకు పంప‌గా.. హత్యకు ముందు యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. ప్ర‌స్తుతం పోలీసులు నిందితుడిపై కేసు న‌మోదు చేసి.. ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: