రోజురోజుకు ఆడవారిపై అకృత్యాలు, అత్యాచారాలు మితిమీరిపోతున్నారు. అర్ధరాత్రి స్త్రీలు ఒంటరిగా సంచరించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం అని మహాత్మాగాంధీ చెప్పాడు. మహాత్ముడు అర్థరాత్రి అన్నాడు కానీ.. పట్టపగలే తిరగలేని దారుణ పరిస్థితి నెలకొంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ఆడపిల్లలకు అలా ఉండాలి.. ఇలా ఉండాలి అని చెప్పే తల్లిదండ్రులు.. మగాళ్లకు మాత్రం ఆడవారి పట్ల ఎలా ఉండాలో నేర్పడం లేదని సమాజంలో జరిగుతున్న దారుణ ఘటనలే చెబుతున్నాయి. దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికి ఆడవారిపై జరిగే అత్యాచారాలు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు.
ఇక ఇప్పటి వరకు ఆడవారికి ఇంటా, బయట రక్షణ లేకుండా పోతోందని అనుకున్నాం. కానీ, శ్మశానంలో పూడ్చిపెట్టిన ఆడవారికి కూడా రక్షణ లేకుండా పోతోంది. తాజాగా కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధులు ఏకంగా శ్మశానంలో పూడ్చిపెట్టిన శవంపై అత్యాచారానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అస్సాంకు చెందిన 14 ఏళ్ల బాలిక మే 17న గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అదే రోజు రాత్రి ఆమె కుటుంబసభ్యులు బాలికను ఊరికి దగ్గరలోని సైమన్ నదీ తీరంలో మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే ఆ తర్వాతి రోజు అకాన్ సైకియా(51) అనే వ్యక్తి బాలికను పూడ్చిపెట్టిన ప్రదేశానికి వెళ్లి శవాన్ని బయటికి తీసి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.
ఇంతలోనే అటుగా వస్తున్న ఓ వ్యక్తి అకాన్ చేసే పనిని చూసి షాక్కు గురయ్యాడు. వెంటనే ఏం చేయాలో తెలియక పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అకాన్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఫోక్సో చట్టంతో పాటు ఐపీసీ 306, 377 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మరోవైపు బాలిక శవాన్ని పరీక్షించేందుకు గాను కుటుంబసభ్యుల అనుమతితో మరోసారి పోస్ట్మార్టంకు తరలించినట్టు తెలుస్తోంది. కాగా, అకాన్ తొలి నుంచి మహిళల పట్ల సైకోగా వ్యవహరించేవాడని స్థానికులు చెబుతున్నారు. దీంతో కొందరు మరణించిన బాలికపై అకాన్ లైంగిక వేధింపులకు పాల్పడటం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.