సమాజంలో రోజు రోజుకు మానవ సంబంధాలు మంటకలిసి పోతున్నాయనడానికి లోకంలో జరుగుతున్న దుర్మార్గపు పనులే ఉదాహరణ.. బ్లెడ్ రిలేషన్ కంటే కూడా బెడ్ రిలేషనే ఎక్కువగా కోరుకుంటున్నారు.. అయితే ఈ కోరిక చాటున వావివరసలు కూడా మరచి పోతున్నారు.. అన్న చెల్లి, తండ్రి కూతురు, అత్త అల్లుడు ఇలా ఏ బంధాలు కామాంధుల కోరికలను ఆపలేక పోతున్నాయి.. ఫలితంగా విచ్చలవిడిగా పశువులకంటే హీనంగా తమ వాంచలు తీర్చుకుంటున్నారు..

 

 

ఈ కాలంలో ఆడపిల్లగా పుట్టడమే పాపం అయ్యిందా అనేలా ఆడవారిపట్ల ప్రవర్తిస్తున్నారు.. ఇకపోతే చిన్నప్పటి నుండి ఎత్తుకుని, అల్లారు ముద్దుగా పెంచిన తండ్రే కామంతో బుసలు కొడుతూ కాటువేస్తే ఆ బాధను ఎవరికి ఏమని చెప్పుకోవాలో తెలియక ఎందరో ఆడపిల్లలు అల్లాడిపోతున్నారు.. మనిషికి ఇంత మదం ఎందుకో.. కన్నకూతురు అనే సోయి కూడా ఉండకుండా నీచమైన బ్రతుకు బ్రతకడం కంటే చావడం నయం.. సిగ్గులేకుండా ఎంత మంది ముఖం మీద ఉమ్మివేసిన ఇలాంటి నీతిమాలిన పనులు లోకంలో జరుగుతూనే ఉన్నాయి..

 

 

ఇప్పుడు ఇలాంటి ఘటనే ఎదురైంది.. అదేమంటే తాండూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (13) తల్లి పదేళ్ల క్రితమే మృతి చెందగా, ఆ బాలిక తండ్రి (37) మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ నేపధ్యంలో తన మొదటి భార్య కూతురును దోమ మండలంలోని ఓ ప్రార్థనా పాఠశాలలో ఉంచి చదివిస్తున్నాడట అయితే మార్చిలో లాక్‌డౌన్‌ కారణంగా ఆ బాలిక తన తండ్రి ఇంటికి చేరుకుంది. అప్పుడే అతనిలోని మదగజం మేల్కొనగా కూతురిపై కామాన్ని పెంచుకున్న వీడు పవిత్ర రంజాన్‌ రోజునే ఇంట్లో ఎవరూ లేని సమయాన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడట. అంతే కాకుండా విషయాన్ని ఎవరితోనైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

 

 

ఇక తనకు జరిగిన అన్యాయానికి లోలోన కుమిలిపోయిందే గానీ ఎవరికి చెప్పుకోలేక మానసిక వేదనపడుతున్న సమయంలో ఆ బాలికను హైదరాబాద్‌లోని ఆమె పెద్దమ్మ ఇంటికి పంపించాడట ఆ నీచుడు. దీంతో తండ్రి చేసిన అఘాయిత్యాన్ని పెద్దమ్మకు వివరించగా, ఆమె వెంటనే గ్రామానికి చేరుకుని విషయాన్ని బాలిక నానమ్మకు వివరించింది. ఇక వారంత జరిగిన ఉదంతం పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అదేసమయంలో బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారట.. అందుకే ఈ కాలంలో ఆడపిల్లలు ఒంటరిగా ఎవరిని నమ్మి ఉండకూడదు.. వారు ఎంత దగ్గరి వారైనా సరే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: