ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో... వైరస్ ను అరికట్టేందుకు లాక్ డౌన్ విధానాన్ని అమలు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఎక్కడ బయటికి వస్తే... కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందో అన్న భయంతో దాదాపు ఎవరూ కూడా బయటకు వచ్చేందుకు సిద్ధపడటం లేదు. తుమ్ము దగ్గులతోనే కరోనా వైరస్ వ్యాప్తి అవుతుండడంతో ప్రజలందరూ కూడా భయపడి ఎక్కువశాతం ఇంట్లోనుంచి బయటకి రావటం లేదు.


అంతేకాకుండా చాలా వరకు లాక్ డౌన్ అమలు అమలు అవడంతో... చాలా మంది ప్రజలు వారి సొంత ఊర్లకు కూడా వెళ్లేందుకు వీలు లేదు. ఇది ఇలా ఉండగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నోయిడాలో వ్యభిచారం నిర్వహించడం గమనించవలసిన విషయం. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు వెంటనే సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సంఘటనలో పోలీస్ అధికారులు ఆరుగురిని అరెస్టు చేశారు. ఇందులో ఇద్దరు యువతులు కూడా ఉండడం గమనార్హం. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే గ్రేటర్ నోయిడాలోని ఒక గెస్ట్ హౌస్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు అని పోలీస్ అధికారులకు సమాచారం అందింది.


అంతేకాకుండా ఈ సెక్స్ రాకెట్  నడుపుతున్న నిర్వాహకుడు, గెస్ట్ హౌస్ యజమానిని పోలీసు అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే వారి వద్ద ఉన్న 12 వేల రూపాయలు నగదును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సంఘటనలో పోలీసు అధికారులు వారి దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ లో మేకప్ కిట్ లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తును మొదలుపెట్టాము అని పోలీసు అధికారులు వెల్లడించారు. ఏది ఏమైనా కానీ ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఇలాంటివి జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: