ఒకవైపు దేశంలో కరోనా పట్టిపీడిస్తున్న, మరోవైపు దేశంలో దారుణాలు, అఘాయిత్యాలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా మహిళలపై అనేక దుశ్చర్యలకు పాల్పడుతున్నారు కొండ్రము దుర్మార్గులు. దయా, కనికరం లేకుండా వారిపై మృగాళ్లలా వేధిస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే... 

IHG


హైదరాబాదులో పాత కక్షల నేపథ్యంలో పాతబస్తీలో మరో దారుణ హత్య జరిగింది. ఈ సంఘటనలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హైదరాబాదులోని బహదూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో మీరాలం ట్యాంక్ వద్ద మహమ్మద్ అలియాస్ చోర్ మహమ్మద్ అనే యువకుడిని ముగ్గురు వ్యక్తులు కత్తులతో దారుణంగా నరికి చంపారు. ఆ ముగ్గురు వ్యక్తులు సయ్యద్ సిద్ధికి, అజర్, షాహిద్ గా గుర్తించారు. అయితే ఈ సంఘటనపై పూర్తి సమాచారం అందుకున్న బహదూర్ పుర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ పూర్తి వివరాలు సేకరించారు.

IHG


వారితోపాటు క్లూస్ టీం సహాయంతో కీలక ఆధారాలను అక్కడ సేకరించారు. ఈ నేపథ్యంలో మహమ్మద్ మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ఇకపోతే హత్యకు గురైన మహమ్మద్ చాలాకాలం రోజుల నుంచి అనేక దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. కాలా పత్తర్ పోలీస్ స్టేషన్లో అతడిపై అనేక కేసులు ఉన్నాయని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ హత్య కేవలం పాత కక్షల నేపథ్యంలోనే చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను పట్టుకోవడం కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ హత్యతో స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి చెందారని చెప్పవచ్చు. ఈమధ్య నరకడలు, చంపడాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి అలాగే కామన్ కూడా అయిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: