రోజురోజుకి దేశంలో అక్రమ సంబంధం కేసులు నానాటికీ ఎక్కువై పోతున్నాయి. ఇలాంటి సంఘటనే ఒకటి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలో తాజాగా సంభవించింది. నిజానికి వారిద్దరూ పెళ్లయిన వాళ్లే. అయినప్పటికీ కూడా వారితో కలసి జీవిస్తున్న వారిని కాదనుకొని పరాయి వ్యక్తులతో ప్రేమలో పడి ఇద్దరు కలిసి జీవించాలని వారి వారి కుటుంబాలను కాదనుకొని ఇద్దరూ వెళ్లిపోయారు. అసలు ఏమైందో తెలియదు కానీ వారిద్దరు చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక ఈ సంఘటనలో పూర్తి వివరాల్లోకి వెళితే...

 


ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండలం గ్రామానికి చెందిన ఒక యువకుడు మరో మహిళ వేర్వేరు వ్యక్తులతో గతంలోనే పెళ్లిళ్లు జరిగాయి. వారిద్దరికీ అప్పటికే ఇద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా సరే కాలం గడిచే కొద్దీ వారివి ఇరువురి మధ్య స్నేహబంధం ఏర్పడి అది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. సమయం దొరికినప్పుడల్లా శారీరకంగా కూడా కలిసేవారు. ఈ క్రమంలోనే ఒకరిని విడిచి ఒకరు ఉండ లేకపోవడంతో వారిద్దరూ వారి కుటుంబాలను వదిలేసి కొత్త జీవితం ప్రారంభించేందుకు అందరినీ విడిచి వెళ్లిపోయారు.

 


సంవత్సరం క్రితం పిల్లలు, కుటుంబాలని వదిలి వీరిద్దరూ ఎక్కడికో వెళ్ళిపోయారు. వీరిరువురు కోసం వారి వారి కుటుంబ సభ్యులు ఎంత గాలించినా కూడా ఫలితం లేకపోయింది. ఇకపోతే శనివారం నాడు ఆ జంట గ్రామానికి చేరుకోగా ఓ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ సంఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మరణించగా మహిళను గమనించిన స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇకపోతే అసలు వారు సంవత్సరం తర్వాత మళ్లీ స్వగ్రామంకు ఎందుకు వచ్చారు అన్న సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అసలు వారు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు కూడా పోలీసులు ఆ దర్యాప్తులో చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: