క్రైం.. ఎంత దారుణంగా పెరిగిపోయింది అంటే మాటల్లో చెప్పలేం. అంత దారుణంగా క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ఇంకా ఈ నేపథ్యంలోనే మరో దారుణమైన క్రైం తమిళనాడులో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు దుండగులు ఆ వ్యక్తిని ఏకంగా 35 సార్లు కత్తితో పొడిచి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు.. అంతే కాదు అతని శరీరం నుండి తలను వేరు చేసి కిరాతకంగా చంపారు. అయితే ఇంత దారుణనికి కారణం కుల కక్షలే కారణం అని సమాచారం. 

 

ఇంకా ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో జరిగింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూత్తుకుడి జిల్లాలోని కీల కీరనుర్‌ గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ మంది నివసిస్తున్నారు. అయితే గతసంవత్సరం వేరే వర్గానికి చెందిన వ్యక్తి చనిపోవడంతో గ్రామ శివారులోని శ్మశానంలో పూడ్చటానికి ప్రయత్నించగా ఆ మెజార్టీ వర్గం ఒప్పుకోలేదు. అయితే అందుకు సత్యమూర్తి అనే 22 ఏళ్ళ యువకుడు ధైర్యంగా నిలబడి ఆ మృతదేహాన్ని అక్కడ పూడ్చేలా చేశాడు. ఇంకా అంతే అప్పటి నుండి అతనిపై ఆ మెజారిటీ వర్గం ప్రజలు సత్యమూర్తిపై కక్ష పెంచుకున్నారు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన సత్యమూర్తిపై దాడి చేసి హత్య చేశారు. అయితే రాత్రి 9 గంటలైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. కానీ ఎక్కడ కనిపించలేదు. అయితే ఊరి చివర్లో తల లేని మృతుదేహాన్ని స్థానికులు చూసారు. దీంతో తల్లితండ్రులకు ఆ సమాచారాన్ని అందిచారు. అది వారి కొడుకు మృతుదేహమే అని గుర్తించిన తల్లితండ్రులు అతని మృతుదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.                        

మరింత సమాచారం తెలుసుకోండి: