అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలు చిన్నా భిన్నం కావడమే కాదు.. లేని పోనీ అపార్థాలు వల్ల ఒకరి నొకరు  చంపుకునే స్టేజ్ లోకి వెళ్తున్నారని అనడం లో ఎటువంటి ఆశ్చర్యం లేదు.. ఓ వ్యక్తి ఓ మహిళ ను అతి కిరాతకం గా కొట్టి బ్రతికుండ గానే పూడ్చి పెట్టిన ఘటన ఆలస్యం గా వెలుగు లోకి వచ్చింది.. వివరాల్లోకి వెళితే..

 

 

 

పీకల దాకా మద్యం తాగి ఎలాంటి ఘోరా  లకు పాల్పడుతున్నారో తెలియకుండా ఉంది. పూటు గా మద్యం తాగిన ఓ వ్యక్తి మహిళను తీవ్రంగా కొట్టాడు. ఆమె బతికుండ గానే గొయ్యి తీసి పూడ్చపెట్టాడు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండ వరం లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే , ఈ విషయం ఆలస్యం గా వెలుగు లోకి వచ్చింది. మృతు రాలి ఏడేళ్ల కుమార్తె విషయం గురించి పెద్దల కు చెప్పడం తో.. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసు లకు ఫిర్యాదు చేశారు.

 

 

 

గొట్ల పాలెం గ్రామం లో పొన్నూరు సుభాషిణి అనే మహిళ కు, సాములు అనే వ్యక్తికి మధ్య వివాహేతర సంబంధం కొన సాగుతోంది. ఓ రోజు ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం ఏదో విషయం లో ఇద్దరూ గొడవపడ్డారు. ఆవేశం లో ఉన్న సాములు కర్ర   తో సుభాషిణి ని గట్టి గా కొట్టాడు.దీంతో ఆమె సృహ కోల్పోయింది. సాములు మరింత రాక్షసంగా మారి, వెంటనే పొదల్లో గుంత తీసి ఆమెను పూడ్చిపెట్టాడు. అనంతరం కూతురిని బెదిరించి పారిపోయాడు. మృతురాలి కుమార్తె రెండు రోజుల తర్వాత విషయం బందువులకు చెప్పడంతో వారు షాకయ్యారు.పోలీసులు అక్కడికి వెళ్లే సమయంలోనే ఆమె చనిపోవడంతో మృత దేహాన్ని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు...

మరింత సమాచారం తెలుసుకోండి: