పెళ్లి జరిగిన మూడు నెలలకే ఆ అమ్మాయికి నూరేళ్ళు నిండిపోయాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న మైనర్ బాలిక మూడు నెలలకే ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని బొండెల్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామంలోని లక్ష్మి, నరసింహ దంపతుల కుమార్తె నవనీత అదే గ్రామానికి చెందిన హనుమంత రెడ్డి కుమారుడు శివ కుమార్ రెడ్డిని కొద్దికాలంగా ప్రేమించుకున్నారు. మూడు నెలల క్రితం వీరిద్దరూ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే బతుకు దెరువు కోసం వీరిద్దరూ హైదరాబాద్ కు వలస వచ్చారు. వీరు వచ్చిన దగ్గర నుండి దేశంలో లాక్ డౌన్ మొదలు అవ్వడం జరిగింది. దీనితో వారికి హైదరాబాద్ పట్టణంలో పనులు లేక తీవ్ర అవస్థలు పడ్డారు. ఇదే నేపథ్యంలో భర్త తనను వేధిస్తున్నాడని నవనీత తన తల్లికి అనేకసార్లు ఫోన్లో చెప్పి బోరున విలపించడం జరిగింది. 

 


ఇకపోతే ఒక నెల రోజుల క్రితం శివ కుమార్ రెడ్డి తన భార్యతో కలిసి స్వగ్రామానికి చేరుకొని నవనీతను తన పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోయాడు. దీనితో అప్పటినుంచి నవనీత కాస్త మనస్థాపం చెంది ఉంటుంది. ఇక ఇదే క్రమంలో నవనీత ఆదివారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి నవనీత ప్రాణాలు కోల్పోయింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సదరు గ్రామానికి చేరుకొని నవనీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత నవనీత తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తునకు పోలీసులు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై బాలల హక్కుల సంఘం తీవ్ర విచారం వ్యక్తం పరిచింది. తొందరపడి వివాహం చేసుకుంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఈ సంఘటన మరోమారు నిరూపించింది. పిల్లలు ప్రేమించుకున్నారు, వాళ్ళు వదిలితే చనిపోతారు... ఇలాంటి కారణాలతో వాళ్లకు పెళ్లి చేసి చివరికి వారి చావులకు కారణం పెద్దలే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: