తెలుగు రాష్ట్రాలలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య అధిక సంఖ్యలో నమోదు అవుతుంటే మరోవైపు.. మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సేవ చేయవలసిన ఒక వాలంటీర్ నిచక పనికి ఒడిగట్టాడు.  ఈ దారుణమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. నిద్రిస్తున్న మహిళ పై తన వక్రబుద్ధి చూపించాడు ఆ వాలంటీర్. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో  పాడు మండలం నల్లగామాల గ్రామంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలను బాధితురాలు భర్త పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. 

 


ఇక పూర్తి వివరాల్లోకి వెళితే నల్లగామాల గ్రామానికి చెందిన భార్య భర్తలు నిద్రిస్తున్న సమయంలో వెంకటేష్ అనే వాలంటీర్ వివాహితను వేధింపులకు గురి చేయడం జరిగింది. నిద్రిస్తున్న మహిళ పై చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. భర్తకు మేలుకవ వచ్చి పట్టుకునే లోపే అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన గ్రామంలో స్థానికంగా కలకలం సృష్టించింది. రాత్రి సమయంలో ఇంటి వద్ద నిద్రిస్తున్న తన భార్య గ్రామ వాలంటీర్ అయిన వెంకటేష్ పై పోలీస్ స్టేషన్ లో శ్రీనివాసులు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీస్ అధికారులకు అతన్ని పట్టుకునే లోపే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు అని తెలియజేశాడు శ్రీనివాసులు.

 


వెంకటేష్ ను పట్టుకొని నిలదీస్తే తాను రాలేదని, తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు అని శ్రీనివాసులు పోలీస్ అధికారులకు తెలియజేశాదు. ఇక శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు పోలీసు అధికారులు వెంకటేష్ ను అదుపులోకి తీసుకొని విచారణ మొదలు పెట్టారు. ఇక వెంకటేష్ నేరం చేశాడని రుజువు అయితే మాత్రం అతనిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఇలాంటివి మరోసారి చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు గ్రామస్తులు కోరడం జరిగింది. అంతే కాకుండా ఇటీవల విశాఖలో కూడా గ్రామ వాలంటీర్ వేధింపులు తట్టుకోలేక మాజీ మంత్రి బండారు డ్రైవర్ కూడా ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: