ప్రేమ అనేది మనసుల కలయిక అని ఒకప్పుడు కానీ ఇప్పుడు మాత్రం ప్రేమ అనే పదాన్ని అవసరానికి వాడుకుంటున్నారు..అంతేకాకుండా ప్రేమ పేరుతో కామా వాంచనను తీర్చుకుంటున్నారు.. ఇంకా చెప్పాలంటే  కోరికలు తీరాక చంపేస్తున్నారు.  అయితే ప్రియురాలిని చంపి పార్ట్ చేశాడు.. ఏడాది తర్వాత ఆ కేసు పూర్వాపరాలు ఇప్పటికీ బయటకు వచ్చింది.. అదేంటంటే ప్రియుడు ప్రియురాలిని చంపి దాచాడు.. 

 

 


వివరాల్లోకి వెళితే..ఉత్తర్‌ప్రదేశ్‌లో గతేడాది జూన్ 14న జరిగిన యువతి దారుణ హత్య కేసును పోలీసుల చేధించారు. మీరట్‌లోని లోహియా గ్రామ పొలంలో తల లేని యువతి శవాన్ని పోలీసులు గుర్తించారు. చేతులు కూడా నరికేసి ఉండటంతో ఆమె ఎవరో కూడా తెలుసుకోవడం కష్టంగా మారింది. అయితే ఆమె శరీరంపై ఉన్న పచ్చబొట్లు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏడాది తర్వాత హంతకుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. టెక్నాలజీ సాయంతో లోహియా గ్రామానికి చెందిన షాకిబ్ అనే యువకుడే ఆమెను దారుణంగా చంపేసినట్లు గుర్తించి కటకటాల్లోకి నెట్టారు.

 

 

షాకిబ్‌ లూథియానాలోని ఓ షాపులో పని చేస్తుండేవాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి(19)పై మనసుపడిన అతడు అమన్ అనే పేరుతో స్నేహం చేశాడు. కొన్నాళ్ల తర్వాత ప్రేమిస్తున్నానని ఆమెను నమ్మించాడు. ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందామని చెప్పడంతో ఆ యువతి ఇంట్లోని నగలు తీసుకుని అతడితో పరారైంది. ఇద్దరూ డౌరాలా ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని జీవించసాగారు. కొద్దిరోజుల తర్వాత అతడి పేరు అమన్ కాదని షాకిబ్ అని, వేరే మతస్తుడని యువతి తెలుసుకుని నిలదీసింది. నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నేను తెచ్చిన నగలు తీసుకుని మా ఇంటికి వెళ్లిపోతాను’ అని ఆమె చెప్పింది.

 

 


ప్రియురాలు తెచ్చిన నగలపై కన్నేసిన ప్రియుడు వాటితో జీవితాంతం బ్రతకొచ్చునని ఆశపడ్డాడు..దాంతో ఓ రోజు పథకం వేశాడు.అనుకున్న విధంగానే కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమెతో తాగించాడు. ఆమె మత్తులోకి జారుకున్నాక సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం కత్తితో తల, చేతులు వేరుచేసి పరారయ్యాడు. ఈ ఘటనలో మొదట ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులకు సవాలుగా మారింది. మృతురాలి శరీరంపై పచ్చబొట్లు, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. ఈ కేసుతో సంబంధమున్న మరో ఆరుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అనుమానం ప్రకారం ప్రియుడు హత్య చేసినట్లు తేలిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: