రోజుకి దేశంలో అఘాయిత్యాలు మహిళలపై ఎక్కువైపోతున్నాయి. వారు చిన్నపిల్లలా, లేక వయసుకు వచ్చిన వారా, లేక ముసలి వాళ్ళ అని ఎటువంటి తేడా లేకుండా వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు నీచులు. ఇకపోతే తాజాగా కేవలం ఎనిమిది సంవత్సరాలు ఉన్న బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన చత్తిస్ ఘడ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ దారుణ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే... కేవలం ఎనిమిది సంవత్సరాలు ఉన్న అన్యం పుణ్యం ఎరుగని బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత జాతీయ రహదారిపై ఆ బాలికను పడేసి వెళ్లిపోయారు దుర్మార్గులు. 

 

బేమెత్ర ప్రాంతం వద్ద సదరు బాలికను తీవ్రగాయాలతో వదిలి వేయడంతో స్థానికులు ఆ అమ్మాయిని గుర్తించారు. అక్కడ ఉన్న స్థానికులు చికిత్స నిమిత్తం ఆ అమ్మాయిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఇకపోతే ఆ బాలికను కిడ్నాప్ చేసి ఆ తర్వాత ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో సమాచారం తెలిసింది. ఇక ఈ విషయాన్ని కేసుగా నమోదు చేసుకొని పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. 


నిజంగా దేశంలో ఇలాంటి సంఘటనలు రోజుకు నాలుగైదు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కఠిన నిర్ణయాలు తీసుకొని కఠిన చట్టాలు వారి కోసం రూపొందించిన ఇటువంటి దుర్మార్గులు మాత్రం మారడం లేదు. దీనితో దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఇక పోతే దేశంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా నిందితులు వీరు అని తెలిసిన వెంటనే వారికి శిక్ష ఖరారు చేసే విధంగా భారతదేశం చట్టాలు రూపు దిద్దుతే ఇటువంటి చర్యలు చేపట్టే వారికి కొద్దిగా అయినా భయం భక్తి ఏర్పడుతాయి. లేకపోతే ఇలాంటి చర్యలు రోజుకి మనం ఎన్ని చూడాల్సి వస్తుందో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: