ఒకప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళను అన్నీ రకాల హింసిస్తున్నారు..ఇప్పుడు రూటు మారింది.. ఆడవాళ్ళు  కూడా దారుణాలకు పాల్పడుతున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.. భర్తకు పిల్లలు పుట్టలేదని వేదింపులు చేయడంతో మనస్తాపానికి గురైన భర్త ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా వెల్గటూరు మండల కేంద్రంలో బుధవారం జరిగింది. గంట్యాల శ్రీధర్‌(35) అనే వ్యక్తి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన శ్రీధర్‌కు రామడుగు మండల కేంద్రానికి చెందిన జల అనే యువతితో 2011లో వివాహం జరిగింది.

 

 

 

 

పెళ్లయ్యాక కొద్ది రోజులు బాగానే ఉన్నారు..ఆ తర్వాత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతుండటంతో పెద్దల మధ్య పంచాయతీలు జరిగాయి. ఈ క్రమంలోనే మద్యానికి బానిసైన శ్రీధర్ భార్యను వేధించసాగాడు. దీంతో 10 రోజుల క్రితం భార్య అతడిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది.రెండ్రోజుల క్రితం శ్రీధర్ భార్య మరో మహిళను వెంటబెట్టుకుని భర్త వద్దకు వచ్చింది. పెళ్లయి ఇన్నాళ్లయినా పిల్లలు పుట్టకపోవడం వల్ల వైద్య పరీక్షలు చేయించుకోవాలని, రెండ్రోజుల్లో కరీంనగర్‌కు రాకపోతే అంతు చూస్తానని బెదిరించి వెళ్లింది. దీంతో పాటు భార్య తరపు బంధువులు కూడా అతడిని బెదిరింపులకు గురిచేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీధర్ మంగళవారం ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు..

 

 

 


అయితే అక్కడ ఎస్సై లేడని, సాయంత్రం రమ్మని చెప్పడంతో ఇంటికి వచ్చేశాడు.  అలా వచ్చేసిన ఆయన భార్య అవమానంచేసిన ఘటనను తలచుకుంటూ మనస్తాపానికి గురయ్యారు...దాంతో తన ఆస్తి మొత్తాన్ని తల్లి పేరున రాసి ఉరివేసుకొని చనిపోయాడు.. ప్రస్తుతం ఈ ఘటన అక్కడ వాతావరణాన్ని విషాదంలోకి నెట్టివేసింది..కేసు నమోదు చేసిన పోలీసులు మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: