ప్రేమించి న వాడి ని పెళ్లి చేసుకుందని ఓ తల్లి దండ్రులు కన్న పెగును కూడా మరచి అతి కిరాతకం గా మహిళను చంపేశారు. ఆధునిక కాలంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పై పలువురు మండిపడుతున్నారు. కులం గోత్రం సరి లేదని అతి దారుణం గా కన్న బిడ్డను పొట్టన పెట్టుకున్న ఓ కసాయి తండ్రి .. కంటది పెట్టిస్తున్న ఘటన. 

 

 


ఇప్పటి వరకు ప్రేమ వివాహం చేసుకున్నందుకు హత్యలు చేసిన ఘటనలు చూశాం. కులం, మతం, ఆస్తి, అంతస్తు కారణాలతోనూ ప్రాణాలు తీసిన ఉదంతాలు విన్నాం. కానీ, ఒకే గోత్రం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు తల్లిదండ్రుల చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయిందో యువతి.ఒకే గోత్రం అయినందుకు సొంత బిడ్డనే చంపేసిన ఘటన ప్రస్తుతం ఢిల్లీలో కలకలం సృష్టిస్తుంది. 

 

 


వివరాల్లోకి వెళితే.. తూర్పు ఢిల్లీలో పాల వ్యాపారం చేసే రెండు కుటుంబాలు పక్కపక్కనే నివాసం ఉండేవి. ఆ రెండు కుటుంబాలకు చెందిన శీతల్‌ చౌదరి, అంకిత్‌ అనే యువతీ యువకులు 2016 నుంచి ప్రేమించుకుని మూడేళ్ల పాటు రహస్యంగా సహజీవనం చేశారు. ఈ క్రమంలో 2019 అక్టోబర్‌లో ఇంట్లో వారికి తెలియకుండా గతేడాది అక్టోబర్‌లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే వారిద్దరూ కుటుంబ సభ్యులతోనే కలిసి ఉంటున్నారు.  


ఇది ఇలా ఉండగా ఈ పెళ్లి విషయాన్ని  శీతల్‌ ఇంట్లో చెప్పేసింది. వారందరు దీన్ని వ్యతిరేకించడమే కాకుండా ఆమెను మాయం చేశారు. కొద్దీ రోజుల నుండి భార్య కనిపించలేదని అంకిత్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. అమ్మాయి తరపు వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించగా ఒకటే గోత్రం ఉండటంతో అమ్మాయిని చంపేశామని చెప్పారు. దీంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు పంపించారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: