దయ, జాలి అనేది లేకుండా కర్కశంగా మే 20న బిహార్‌కు చెందిన సంజయ్‌కుమార్‌ అనే ఉన్మాది వరంగల్‌ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని బావిలో తొమ్మిది మందిని పడేసి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ హత్యల తర్వాత సంజయ్‌ని అరెస్ట్ చేసిన పోలీసులకు ఆ తొమ్మిది మందిని ఎలా హత్యచేశాడు అన్న విషయాలు సంజయ్ చేబుతుంటే ఇతను మనిషా లేక మానవ మృగమా అనే అనుమానాలు కలిగే తీరులో ఉన్నాయట..

 

 

అయితే ఈ మృత్యు బావి’ కేసు విచారణలో వెలుగులోకి వచ్చిన మరో విషయం ఏంటంటే.. మూడేళ్ల చిన్నారి గుక్క పట్టి ఏడుస్తున్నా.. కనికరం లేకుండా నిందితుడు బావిలో పడవేయడం అమానుషం.. ఇకపోతే నిందితుడిని కోర్టులో హాజరు పరిచిన పోలీసులు సంజయ్‌ని గత 30వ తేదీన ఆరు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఈ క్రమంలో బావి దగ్గరకు తీసుకెళ్లి కీలక ఆధారాలు సేకరించారు. ఇక మరోసారి గురువారం ఉదయం 5 గంటలకు నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయగా ఆ 9 మందిని ఎలా హతమార్చాడో చెప్పాడు..

 

 

వారందరికి ఆహారంలో నిద్ర మాత్రలు కలపగా, ఆ పదార్దాలు తిన్న వారు అపస్మారకస్థితిలోకి వెళ్లారు. అలా వెళ్లిన వారిలో మొదట అయిదుగురిని గోనె సంచుల్లో వేసుకుని బావిలో పడేశాడు. అప్పటి వరకు నిద్రిస్తున్న మూడు సంవత్సరాల బబ్లూ ఆకలి అవడంతో లేచి తన తల్లి వద్దకు వెళ్లి గుక్క పట్టి ఏడుస్తున్నాడట.. పాపం ఆ పసివానికి తెలియదుగా  తన తల్లి అపస్మారక స్థితిలో ఉందని.. ఇక ఆ పిల్లవాన్ని చూసిన ఈ రాక్షసునికి పసివాడు అనే కనికరం లేకుండా ఎత్తుకెళ్లి బావిలో పడేసి హతమార్చాడట. కాగా మక్సూద్‌, ఆయన భార్య నిషా, షకీల్‌లు బరువుగా ఉండడంతో భుజాలకు తాళ్లు కట్టి లాక్కెళ్లినట్లు తెలిసింది. ఇక ఈ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ తర్వాత నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: