కామంతో కొట్టుకుంటున్న మృగాళ్లు వావి వరుసలు మరచి రెచ్చిపోతున్నారు.. చిన్నా పెద్దా అని వయసుతో సంబంధం లేకుండా ఇష్టాను సారంగా ప్రవర్తిస్తున్నారు..అలాచుసుకుంటే చాలా మంది మహిళలు మగాళ్ళ కామ దాహానికి బలవుతున్నారు.. ఎందరో మహిళలు ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు..ఇంట్లో ఉన్న వాళ్ళతోనే ఆడవాళ్ళకు రక్షణ లేకుండా పోయింది..సొంత అక్క భర్తనే ఘాతుకానికి పాల్పడ్డాడు.. 

 

 

 

మరదలిపై కన్నేసిన బావ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళితే..నిండు గర్భంతో ఉన్న అక్కకి సాయంగా ఇంటికొచ్చిన మరదలిపై కన్నేశాడో ప్రబుద్దుడు. భార్య లేని సమయంలో ఆమె చెల్లెలిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. గదిలోకి బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. చెల్లెలి జీవితాన్ని నాశం చేశాడన్న విషయం తెలిసి తట్టుకోలేకపోయిన భార్య.. కట్టుకున్న భర్తని దారుణంగా హత్య చేసింది. నెలలు నిండిన భార్య తన భర్త శవాన్ని ఇంటి వెనక పాతిపెట్టింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.

 

 

 


గర్భంతో ఉన్న అక్కకి సాయం చేయడానికి వచ్చిన చెల్లెలిని అలా చేసిన భర్తను చూసి అసహ్యించుకునే స్థాయి ఆమె కోపం చేరింది..ఆ విషయం మరుసటి భార్యకి తెలియడతో ఆగ్రహానికి గురైంది. కడుపుతో ఉన్న తనకి సాయం చేసేందుకు వచ్చిన చెల్లెలిని భర్త కామంతో కాటేయడాన్ని జీర్ణించుకోలేకపోయింది. చెల్లెలి జీవితాన్ని పాడుచేసిన భర్తని గొడ్డలితో నరికి కిరాతకంగా హత్య చేసింది. దారుణంగా నరికి చంపేసింది. 9 నెలల గర్భంతో ఉన్నప్పటికీ భర్త శవాన్ని ఇంటి వెనుక పెరట్లోకి లాక్కెళ్లి గొయ్యి తవ్వి పాతిపెట్టేసింది.అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది.. తన భర్తను హత్య చేసింది తానే అని ఒప్పుకుంది.పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితురాలి చెల్లెలిపై అత్యాచారం జరిగిందా? లేదా? అనేది తెలుసుకునేందుకు వైద్య పరీక్షల నివేదికలు రావాల్సి ఉందని పోలీసు అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: