తల్లితండ్రులు కొన్ని చెయ్యకపోతేనే పిల్లల జీవితం బాగుంటుంది.. ఇంకా అలానే యుపిలో ఓ దారుణ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పదో తరగతి చదువుతున్నా పదిహేనేళ్ల బాలుడు తండ్రి ఇటీవలే గుండెపోటుతో మరణించాడు. దీంతో తల్లి నెలకే మరొకరిని పెళ్లి చేసుకుంది. ఇది అంత ఆ బాలుడికి నచ్చలేదు. దీంతో తల్లి ఆ బాలుడికి ఎంతో నచ్చ చెప్పి చూసింది. కానీ ఫలితం లేదు. 

 

ఇంకా రోజు రోజుకు కొడుకుకు సవతి తండ్రిపై కోపం ఎక్కువ అవుతుంది. దీంతో సవతి తండ్రిని చంపాలని నిర్ణయించుకున్నాడు. పకడ్బందీగా ప్లాన్ వేశాడు. సవతి తండ్రి వచ్చే దారిలో కాపు కాసాడు. బైక్ పై తన సోదరుడితో కలసి వస్తున్న సవతి తండ్రిని కింది పడేసి ఇనుప రాడ్డుతో కొట్టాడు. కిందపడిన సవతి తండ్రిని తుపాకీతో కసితీరా కాల్పులు జరిపాడు. బులెట్లు శరీరం నుండి దూసుకుపోయాయి. దీంతో అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇంకా అతని సోదరుడు అక్కడి నుండి పరార్ అయ్యాడు. 

 

అయితే ఇది అంత ఒక ఎత్తు అయితే.. అతన్ని చంపేసి ఆ బాలుడు తుపాకీతో నేరుగా ఇంటికి వెళ్లిన ఆ బాలుడు అమ్మ నీ భర్తను చంపేశా అంటూ చెప్పాడు. అంతే.. అమ్మకు చెప్పిన బాలుడు వెంటనే అక్కడి నుండి పరార్ అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలిస్తున్నారు. ఇంకా నిందితుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న  పోలీసులు బాలుడి కోసం గాలించడం ప్రారంభించారు. అందుకే తల్లితండ్రులు ఏదైనా ఒక పని చేసే ముందు ఇంట్లో పిల్లల మానసిక స్థితి ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. అప్పుడే జీవితం అందంగా.. ఆనందంగా ఉంటుంది.                       

మరింత సమాచారం తెలుసుకోండి: