ఈ భూమ్మీద కామాంధుల కాలం రోజు రోజుకు పెరుగుతుంది... ఎంతో మంది ఆడవాళ్ళూ తమ మాన ప్రాణాలను కోల్పోయిన కూడా ఈ మానవ మగ మృగాలు మాత్రం మారలేదు. రోజు రోజుకు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరుగుతూ వస్తున్నాయి. మొన్న హైదరాబాద్ లోని శంషాబాద్ లో జరిగిన దిశా సంఘటన పూర్తి గా మరువక ముందే ఎందరో ఆడపిల్లల కామాంధుల చేతిలో నలిగిపోయారు. 

 


అయినా కూడా రెచ్చిపోతూనే వస్తున్నారు. చట్టాలు మారిన, శిక్షలు పూర్తిగా మారిన కూడా ఎక్కడ ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు మాత్రం మారలేదు. సినిమాలను మించిన క్రైం రేటు ఇప్పుడు మన చుట్టూ కనిపిస్తుంది. అయితే తాజాగా తమిళ నాడులో జరిగిన ఈ సంఘటన యావత్ జనాన్ని కదిలించి వేస్తుంది. ప్రియుడి కళ్ళ ముందే కామాంధులు అతి కిరాతకంగా ప్రవర్తించారు. 

 

 


వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని వేళ్లూరులో శనివారం ఓ ఘటన చోటుచేసుకుంది. 24 ఏళ్ల మహిళను ముగ్గురు వ్యక్తులు కత్తితో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వేళ్లూరు పట్టణ కేంద్రం మధ్యలో ఉన్న కోట సమీపంలో రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిందితులు మహిళ బాయ్‌ఫ్రెండ్‌ను చితకబాది తన ప్రేయసి పై అత్యాచారం చేశారు. అనంతరం వారి వద్ద ఉన్న వస్తువులను సైతం అపహరించుకుపోయారు. అత్యాచారం, దోపిడి కేసులు నమోదు చేసిన పోలీసులు 18 ఏళ్ల వయస్సున ఇద్దరు యువకులను అరెస్ట్‌ చేశారు. 


 

మిగిలిన వాళ్ళు పరారీలోఉన్నారు. వారిని వెతికే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ప్రభుత్వ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2018లో భారత్‌లో ప్రతీ 15 నిమిషాలకు ఓ అత్యాచార ఘటన చోటుచేసుకున్నట్లు ఓ మహిళ పేర్కొంది. కేంద్ర హోంశాఖ రిపోర్ట్‌ ప్రకారం 2018లో మొత్తం 34 వేల అత్యాచార కేసులు నమోదయ్యాయి. సగటున రోజులో అత్యాచారానికి గురయ్యే మహిళలు ఎక్కువగానే ఉన్నారని వారు పేర్కొన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: