ప్రస్తుత రోజుల్లో మోసాలు, కుట్రలు ఎలా జరుగుతున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఒక అపరిచిత ఫోన్ కాల్... అక్రమ సంబంధానికి దారి తీసి... చివరకి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. దారుణమైన సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాజధాని అయిన బెంగళూరు నగరంలో మాదావరలో జీవనం కొనసాగిస్తూ ఉండే చంద్రశేఖర్ కు చిన్నాదేవి అనే ఒక మహిళ మిస్డ్ కాల్ ద్వారా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.  

IHG


ఇలా కొన్ని రోజులకు ఈ పరిచయం కాస్త ఫోన్ లో చాటింగ్ చేసుకునే వరకు వెళ్ళింది. ఇక మరి కొన్ని రోజుల తర్వాత వీరిద్దరి మధ్య ఉన్న అనుసంధానాన్ని అక్రమ సంబంధానికి దారి తీసింది. అంతేకాకుండా వీరిద్దరికీ ఎవరికి తెలియకుండా కూడా పక్కన కాపురం కూడా పెట్టడం జరిగింది. ఇక విషయం తెలుసుకున్న ఆ  వివాహిత మహిళ భర్త... వారిని వెతికి చివరకు తన భార్యను ఇంటికి తీసుకొని వచ్చాడు. ఇది జరిగినా కూడా ఆమె ఇంటికి వెళ్లినా మళ్ళీ తన ప్రియుడితో స్నేహం కొనసాగిస్తూనే వచ్చింది. అంతే కాకుండా మరికొన్ని రోజులకు మళ్లీ అతనితో వెళ్లిపోవడం జరిగింది.


ఇక భార్య రెండో సారి కూడా ఇలా వెళ్లిపోవడంతో.. ఆమె భర్త తట్టుకోలేక.. చంద్ర శేఖర్ ని చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. అలాగే బంధువులతో కలిసి చంద్రశేఖర్ ఎక్కడ జీవనం కొనసాగిస్తున్నాడు కనుక్కొని అక్కడకి వెళ్లి చంద్రశేఖర్ పై దాడికి పాల్పడ్డారు. దీనితో చంద్రశేఖర్ తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను సేకరించి పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా కేసు సంబంధించిన దర్యాప్తు కూడా మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: