చాలామంది మహిళలు పిల్లలు పుట్టాలని అనేక కోరికలు ఉంటాయి. వాళ్ళని అలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలి... అని ముందు నుంచే కలలుకంటూ ఉంటారు. కానీ ఒక కసాయి తల్లి... తనకు ఆడపిల్ల పుట్టింది అన్న కారణంతో ఆ పసి పిల్లల్ని నీట ముంచింది. ఆ తర్వాత ఆమె కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక ఉరికి వేలాడుతున్న ఆమెను చూసి భర్త షాక్ కి గురి అవ్వడం జరిగింది. ఈ దారుణమైన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. 

 


ఈ కేసు విషయం మీద పూర్తి వివరాల్లోకి వెళితే... ఈరోడ్ జిల్లా పెరుందురై పరిధిలోని విజయమంగళానికి చెందిన సంగీత, గుణశేఖరన్ ఇటీవల వీరికి ఆడబిడ్డ పుట్టింది. ఇక సంగీత గర్భం దాల్చినప్పటి నుంచి కొడుకు పుడతాడని ఆశతో ఎదురు చూసి చివరకు ఆడబిడ్డ పుట్టడంతో నిరాశకు గురి అయ్యింది. అంతే కాకుండా తీవ్ర మనస్తాపం చెందింది ఆమె. దీనితో ఆమె కోపంతో అఘాయిత్యానికి పాల్పడింది ఆ తల్లి. మూడు నెలల పసి పిల్లల్ని దారుణంగా హత్య చేయడం జరిగింది.

 


నీటి డబ్బులు ఆ చిన్నారి ముంచి తిరుగు రాలేని లోకాలకు పంపించేసింది. ఆ తర్వాత సంగీత కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది సంగీత. ఇక భర్త గుణశేఖరన్ ఊరికి వేలాడుతున్న తన భార్యను చూసి షాక్ కి గురి అవ్వడం జరిగింది. అంతేకాకుండా కూతురి కోసం ఇల్లు అంతా కూడా వెతకగా ఒక టబ్ లో నీటమునిగి కూతురు చనిపోవడంతో కన్నీరు మున్నీరు అయ్యాడు. ఇక అదే గ్రామంలో ఉంటున్న భార్య సోదరులకి విషయం తెలియ జేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించడం జరిగింది. ఇక తల్లీకూతుర్ల మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించేందుకు ఆస్పత్రికి తరలించారు పోలీస్ అధికారులు. అలాగే సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: