పరువు హత్యలు.. ఈ పేరు వినగానే మనకు ప్రణయ్ అమృతనే గుర్తు వస్తారు. ఎందుకంటే వాళ్ళ పేర్లు అలా హాల్ చల్ అయ్యాయి. ఇంకా అలాంటి పరువు హత్యలు రాజస్థాన్, బీహార్ వంటి రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉంది. అలానే ఇప్పుడు కూడా ప్రియుడితో కూతురు పారిపోయిందన్న కోపంతో ఇద్దరినీ దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని ధోల్‌పూర్ జిల్లా రాజ్‌ఖెరా పరిధిలోని థార్ గ్రామానికి చెందిన బంటు సింగ్, అనిత సింగ్ అనే 20 ఏళ్ళ యువతీ గత కొద్దికాలంగా ప్రేమించుకున్నారు. ఇంకా వారి పెళ్ళికి పెద్దలు అంగీకరించారు అని ఇంటి నుండి ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రియుడితో పారిపోయి వారి పరువు తీశారు అని అనిత కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోయారు. 

 

ఇంకా ఆ ప్రేమ జంట కోసం గాలించినప్పటికీ జడ తెలియకపోవడంతో అందరూ సైలెంట్ అయ్యారు. అయితే ఆ పారిపోయిన ప్రేమ జంట ఇటీవలే ఉరికి తిరిగొచ్చింది. ఇంకా ఈ విషయం  తెలుసుకున్న అమ్మాయి తల్లితండ్రులు అబ్బాయి ఇంటిపై దాడి చేసి ఇంట్లో ఉన్న ప్రేమ జంటను బయటకి లాక్కొచ్చి అత్యంత దారుణంగా కిరాతకంగా నరికి చంపేశారు. 

 

యువతీ యువకుడు ఇద్దరు ప్రాణాలు విడిచారు. అయితే యువతి, యువకులిద్దరిదీ ఒకే గోత్రమని.. ఒకే గోత్రం కలిగిన వారు పెళ్లి చేసుకోకూడదని అందుకే చంపినట్టు యువతీ తల్లితండ్రులు చెప్పినప్పటికీ.. అది ముమ్మాటికీ పరువు హత్యే అని.. యువకుడు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రేమిచుకుని పారిపోయారన్న కోపంతోనే జంటని నరికి చంపారు అని చెప్పారు.                                                  

మరింత సమాచారం తెలుసుకోండి: