ప్రతి రోజు ఏదోక వార్త మహిళ ల పై కామాంధుల లైంగిక దాడి జరుగుతూ వస్తున్నాయి.. ప్రభుత్వ చట్టాలు  ఎన్ని కొత్త గా అమలు లోకి వస్తున్నాయి.అయిన కానీ ఆడపిల్లలు, మహిళలు మృగాళ్ల  పై లైంగిక దాడులు చేస్తున్నారు.మైనర్ బాలిక ను బలవంతం గా ఎత్తు కెళ్లి  ఇంట్లో తాళికట్టి  అనంతరం శోభనం పేరు తో లైంగిక దాడి చేసి హింశించాడు.. అమ్మమ్మ అనుమానం తో ఆరా తీయ గా అసలు నిజం బయటకు వచ్చింది.. 

 

 

 

వివరాల్లోకి వెళితే.. మైనర్ బాలికకు బలవంతం గా తాళికట్టి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడి ని తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురు పోలీసులు అరెస్ట్ చేశారు. పి.గన్నవరం మండలం లోని ఓ గ్రామాని కి చెందిన బాలిక(15) మామిడి కుదురు మండలం లోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ అమలాపురం లోని ఓ కాలేజీ లో ఇంటర్ చదువుతోంది. రోజూ కాలేజీ కి వెళ్లొచ్చే క్రమం లో అప్పన్నపల్లి లో పెట్రోల్ బంకు లో పని చేసే పెదపట్నం గ్రామాని కి చెందిన కత్తిమండ మహేష్‌(28) బాలిక పై కన్నేశాడు. ఆమెకు మాయ మాటలు చెప్పి పరిచయం పెంచుకున్నాడు.

 

 

 

 

గతేడాది డిసెంబర్ 18న బాలికను తన ఇంటికి తీసుకెళ్లి బలవంతంగా తాళి కట్టేశాడు. అనంతరం శోభనం పేరుతో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాలిక మానసికంగా కుంగిపోవడంతో అనుమానం వచ్చిన అమ్మమ్మ ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో బాలిక అమ్మమ్మ ఈ నెల 5వ తేదీన మామిడికుదురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుల పిర్యాదు మేరకు నిందితుడిని రిమాండ్ కు తరలించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: