ప్రేమ పేరు తో యువత మోసాల కు నేరాల కు పాల్పడు తున్నారు.. ప్రేమ పేరు తో అమ్మాయిల ను శారీరకం గా మానసికం గా దగ్గర అవుతున్నారు. అలా అబ్బాయి ల చేతుల్లో మోస పోతున్నారు.. ప్రేమ వ్యవహారం తో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్ ‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం ప్రశాంత్‌ నగర్‌ లో విషాదం నింపింది. ప్రశాంత్ ‌నగర్‌ గ్రామాని కి చెందిన కళమ్మ అనే మహిళ భర్త చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. దీంతో ముగ్గురు కూతుళ్ల ను ఆమే పెంచి పెద్ద చేసింది. 

 

 

 

పెద్ద కుమార్తె కు వివాహం కాగా మిగిలిన ఇద్దరు కూతుళ్ల తో కళమ్మ కలిసి జీవిస్తోంది. ఈ క్రమం లోనే సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటి కి వెళ్లిన రెండో కుమార్తె సుమలత (32) ఎంతకూ తిరిగి రాలేదు. ఆమె కోసం తల్లి, చెల్లి గాలించ గా పాత ఇంట్లో ని దూలాని కి ఉరేసు కుని కనిపించింది. దీంతో వెంటనే  పోలీసులకు సమాచారం అందించారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అమ్రాబాద్‌ సివిల్‌ ఆసుపత్రి కి తరలించారు. 

 

 

 

తన కూతురు ఆత్మ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని సుమలత తల్లి కళమ్మ పోలీసుల కు ఫిర్యాదు చేసింది. అదే గ్రామాని కి చెందిన ఓ యువకుడు, సుమతల మూడేళ్లు గా ప్రేమించుకుంటున్నారని, ఎన్నిసార్లు పెళ్లి ప్రస్తావన తెచ్చినా అతడు దాటవేస్తుండటం తోనే మనస్తాపాని కి గురై ఆత్మ హత్య చేసుకుందని ఫిర్యాదు లో పేర్కొంది. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మగాళ్ళ చేతిలో పడి అన్నీ సమర్పించుకుని చివరికి వాడు పెళ్లి చేసుకొనంట్లే ఇంక మోసపోయామని తెలుసుకొని తనువు చాలిస్తున్నారు.. అలాంటి పనులు చేయవద్దని పోలీసులు తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: