కొన్ని ఘటనలు అందరిని షాక్ కి గురి చేస్తుంటాయి.. సాధారణంగా మన పెద్ద వాళ్ళు అంటుంటారు.. ప్రతి ఒక్కరి పాపం పండుతుంది అని. అలానే అనంతపురంలో ఓ వ్యక్తి పాపం పండింది. పరాయి మహిళా కోసం భార్యను చంపి పోలీసుల నుండి తప్పించుకున్న వ్యక్తి అదే పరాయి మహిళను చంపి ఇప్పుడు జైలు కుడు తింటున్నాడు. 

 

IHG

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాలోని సోమందేపల్లి మండలం పత్తికుంటపల్లికి చెందిన రామాంజికి అదే ప్రాంతానికి చెందిన మరెక్క అనే మహిళతో పెళ్లి అయ్యింది. అయితే అదే ప్రాంతానికి చెందిన సంజీవమ్మ అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇంకా ఇద్దరు కలిసి రాసలీలలు కొనసాగించారు. 

 

IHG

 

అయితే వారి ఇద్దరి మధ్య  భార్య అడ్డుగా ఉంది అని భార్యను దారుణంగా హత్య చేసి నట్టింట్లోనే భార్య శవన్నీ పాతిపెట్టాడు. అయితే అనంతరం ప్రియురాలుతో అదే ఇంట్లో రాసలీలు కొనసాగించాడు. అయితే చివరికి ఆమెతో కూడా వివాదాలు తలెత్తడంతో ఆమెను కూడా అత్యంత దారుణంగా హత్యా చేశాడు. 

 

IHG

 

ఇంకా ప్రియురాలును చంపినా సంగతి పోలీసులకు తెలియడంతో రామాంజిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో భార్యను హత్య చేసిన నిజాలు బయటపెట్టాడు. దీంతో పోలీసులు ఇంటికి వెళ్లి మృతదేహం అవశేషాలను గుర్తించి ఫోరెన్సిక్ టీమ్ మృతురాలి నమూనాలు సేకరించి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: