భార్య భర్త చేసే టార్చర్ ఎంతైనా సహిస్తుంది కానీ సవతి పోరుని మాత్రం సహించలేదు. ఎందుకంటే భర్తను పంచుకోలేదు కాబట్టి. తన భర్త తనకు మాత్రమే కావాలి అనుకుంటుంది కాబట్టి. ఇంకా అలాంటి భార్యభర్త ప్రియురాలుతోనే ఉంటున్నాడు అని రగిలిపోయింది. ఇంకా అంతే ఆ భార్య చేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

వైరల్ అయ్యే అంత ఘటన ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి.. భార్య ప్రియురాలిని అతి దారుణంగా కాల్చి చంపేసింది. ఈ వైరల్ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మొరాదాబాద్‌లో చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన షబానా భర్తతో కలిసి అదే ప్రాంతంలో నివాసం ఉంటుంది. 

 

అయితే ఆ భర్త మాత్రం అదే ప్రాంతానికి చెందిన మరో మహిళతో వివాహితర సంబంధం పెట్టుకున్నాడు.. ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. గత కొద్దీ రోజులుగా భర్త అసలు ఇంటికే రావడం లేదు. దీంతో ప్రియురాలి మోజులో ఆమెను పట్టించుకోవడం లేదు అని భార్య ఆగ్రహంతో ఊగిపోయింది. 

 

తన భర్తను తనకు కాకుండా చేస్తున్న సవతిని చంపేయాలని నిర్ణయించుకుంది. ఇంకా అంతే.. అదను చూసి తుపాకీతో భర్త ప్రియురాలిని కాల్చి చంపేసింది. బులెట్లు ఆమె శరీరం నుండి దూసుకెళ్లడంతో ఆమె తీవ్రగాయాలతో పడి ఉన్న ప్రియురాలిని ఆస్పత్రికి తీసుకెళ్ళినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.                        

 

అప్పటికే ఆమె మరణించింది. ఇంకా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మొరాదాబాద్ పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. దీంతో ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.                 

మరింత సమాచారం తెలుసుకోండి: