ఇంట్లో పులిహోర ఉన్నా ఈ మగాళ్లకు బయట దొరికే పులిసిన పుల్కాలే కావాలంటున్నారు.. భార్య ఉండగా మరొక దానితో పడక సుఖాన్ని పొందడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా వెలుగులోకి వచ్చాయి.. మరో విషయమేంటంటే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాదు ఇంట్లో ఉన్న పెళ్ళాన్ని రాచి రంపాలు పెడుతున్నారు.. ఇక్కడ ఓ వ్యక్తి భార్య ఉండగానే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.. 

 

 

 


అంతేకాక భార్యను మాటలతో హింసిస్తూ వస్తున్నాడు.. ఓ రోజు గొడవ ఎక్కువ కావడంతో తననిచంపేసి నట్టింట్లోనే పూడ్చి పెట్టాడు..వివరాల్లోకి వెళితే..ప్రియురాలితో ఎంచక్కా నాలుగేళ్లు ఎంజాయ్ చేశాడు. తీరా చివరికి ఆమెతోనూ గొడవలు జరగడంతో దారుణంగా అంతమొందించాడు. ప్రియురాలి హత్య కేసు విచారణ చేపట్టిన పోలీసులకి దిమ్మతిరిగిపోయే షాక్ తగిలింది. నాలుగేళ్ల కిందట భార్యని కూడా అతనే హత్య చేశాడని తెలియడంతో కంగుతిన్నారు. ఈ దారుణ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది.

 

 

 

సోమందేపల్లి మండలం పత్తికుంటపల్లికి చెందిన రామాంజికి అదే ప్రాంతానికి చెందిన మారెక్కతో వివాహమైంది. అనంతరం అతినికి సంజీవమ్మ అనే మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ రహస్యంగా కలుసుకుని రాసలీలలు సాగించేవారు. ఇద్దరి మధ్య భార్య అడ్డుగా ఉందని భావించిన రామాంజి.. నాలుగేళ్ల కిందట ఆమెను దారుణంగా హత్య చేశాడు. భార్య శవంతో సహా నిజాలను కూడా నట్టింట్లోనే పాతిపెట్టేశాడు.

 

 

 


తర్వాత ప్రియురాలిని కూడా దారుణంగా చంపేశాడు..ఆమెను కూడా ఇంట్లోనే పాతి పెట్టీ ఉడాయించాడు..విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.వెంటనే నిందితుడి ఇంటికి వెళ్లి తవ్వి మృతదేహం అవశేషాలను గుర్తించారు. ఫోరెన్సిక్ టీం స్పాట్‌కి చేరుకుని మృతురాలి నమూనాలు సేకరించారు. అక్కడే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రియురాలి హత్యతో భార్య మర్డర్ కూడా బయటకు పొక్కింది..

మరింత సమాచారం తెలుసుకోండి: