యుక్త వయసు లో ఉన్నవాళ్లు ప్రేమ అని బరి తెగించి తిరుగు తున్నారు.. అంతే కాక ప్రేమ పేరు తో రాస లీలలు చేస్తూ అడ్డం గా బుక్కయి ప్రాణాల ను కోల్పోతున్నారు.. అబ్బాయి ల తల్లి దండ్రులు లైట్ తీసుకున్నట్లు అమ్మాయి ల పెద్దలు ఎక్కడ తీసు కోలేరు.. అలాంటిది ఇప్పుడు ప్రియురాలి ని కలవడాని కి వెళ్లిన ప్రియుడు అక్కడే శవమై పడి ఉన్నారు.అసలెందుకు అతను అలా చని పోయాడు అనే విషయాలు అందరి నీ ఆశ్చర్యాని కి గురిచేశాయి..

 

 


అమ్మాయి ఎంత చెప్పిన విన లేదని అమ్మాయి తరపు తల్లి దండ్రులు అతి దారుణం గా అబ్బాయి ని నరికి చంపినా ఘటన ఆలస్యం గా వెలుగు లోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... తమ కుమార్తె ను ప్రేమిస్తున్న ఓ దళిత యువకుడ్ని అగ్రవర్ణాని కి చెందిన కుటుంబ సభ్యులు దారుణం గా కొట్టి చంపారు. మహారాష్ట్ర లోని పూణె లో ఈ దారుణ ఘటన జరిగింది. 20 ఏండ్ల విరాజ్‌ జగ్తాప్‌కు అగ్రకులాని కి చెందిన ఓ యువతి తో ఏర్పడిన పరిచయం ప్రేమ గా మారింది. ఈ విషయం తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడుకుందామ ని చెప్పి సోమ వారం రాత్రి అతడ్ని ఇంటి నుంచి బయటకు రప్పించారు. 

 

 

 

రోడ్డు మీద బైక్‌పై వెళ్తున్న విరాజ్‌ను తమ వాహనంతో ఢీకొట్టారు. అతడు కింద పడిపోగా ఇనుపరాడ్లు, బండ రాళ్లతో తీవ్రంగా కొట్టారు. తమ కుమార్తెను ప్రేమించడంపై ఆమె తండ్రి బూతులు తిట్టి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన విరాజ్‌ దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి తండ్రితో పాటు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. వీరిలో ఇద్దరు మైనర్‌ బాలురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: