సమాజంలో జరిగే కొన్ని కొన్ని దృశ్యాలు మనసును మెలిపెట్టేలా ఉంటాయి.. అలాంటివి వింటుంటే.. ఏంటి అంత ఘోరం జరిగిందా అని ఆశ్చర్యం కలుగక మానదు.. అది మంచి కావచ్చూ, చెడు కావచ్చూ.. కానీ మనుషుల్లో స్వార్ధం మాత్రం పెరిగి పోతుందని తెలుస్తుంది.. ఈ కాలంలో మనుషులు రాక్షసులకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారనడానికి నిత్యం మన ముందు జరుగుతున్న ఘోరాలు వార్తల రూపంలో ప్రతి మూలకు చేరుతున్నాయి.. అవన్ని చూస్తుంటే మనిషి మారాలి అనుకున్నారే గాని ఇంతలా మారిపోయాడేంటని మనల్ని మనం ప్రశ్నించుకునే సమయం ఇది అని అనిపిస్తుంది..

 

 

ఇకపోతే అక్రమ సంబంధమో లేక మరే ఇతర కారణమో తెలియదు గానీ పుట్టి కళ్లు కూడా తెరవకముందే ఓ నవజాత మగ శిశువు కుక్కలకు ఆహారంగా మారిన ఘటన వెలుగులోకి వచ్చింది.. ఈ హృదయవిదారక సంఘటన తమిళనాడులో బుధవారం చోటుచేసుకుంది. ఆ వివరాలు చూస్తే.. చెన్నై పెరంబూర్‌ రాఘవ రోడ్డులో ఉన్న ఏరికరై వద్ద కుక్కలు గుంపులుగా ఓ శిశువును పీక్కుతింటున్న దృశ్యాన్ని చూసిన అక్కడి స్థానికులు వెంటనే తిరువికానగర్‌ పోలీసులకు సమాచారం అందించారు.. అయితే పోలీసులు అక్కడికి చేరుకోవడాని కంటే ముందే శిశువు ప్రాణాలు విడిచినట్లు గుర్తించారు. కాగా ఆ చిన్నారి పుట్టి అప్పటికి కొన్ని గంటలే అయినట్లు పోలీసులు తెలిపారు.

 

 

ఇక కేసు నమోదు చేసుకున్న వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వ ఆస్ప్రతికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.. చూశారా మనం మనుషులుగా బ్రతకడం ఎప్పుడో మరచి పోయాం.. కనీసం అప్పుడే పుట్టిన పిల్లల పట్ల అయినా కాస్త జాలిగా ఉంటే మనలోని కౄరత్వం ఏం నశించదు.. ఇక ఈ శిశువు అక్రమ సంబంధం వల్ల పుట్టిందా, లేక ప్రాణాలు పోయాక అలా పడవేసార అన్నది పక్కనపెడితే మాత్రం ఒక మనిషి పట్ల ఇంత కౄరంగా ప్రవర్తించడం మాత్రం క్షమించరాని నేరం అని అంటున్నారు నెటిజన్స్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: