టైటిల్ వినడానికి కామెడీగా ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ ఇది నిజమైన ఘటన. ఏంటి అలా కూడా చస్తారా? అని మీకు అనిపించచ్చు. అలా అనిపించడంలో తప్పే లేదు. అయితే పెళ్లి అయ్యి కేవలం అంటే కేవలం 24 గంటలే అయ్యింది. ఇంతలోనే వరుడు వధువును దారుణంగా హత్య చేసి అతను ఆత్మహత్య చేసుకొని మరణించాడు. ఈ దారుణమైన ఘటన తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లా పొన్నేరి సమీపంలోని సోమంజేరి గ్రామంలో చోటు చేసుకుంది. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరువళ్ళూరు జిల్లా పొన్నేరి సమీపంలోని సోమంజేరి గ్రామానికి చెందిన నివాసన్ అనే యువకుడుకు సమీప బంధువు సంధ్యను ఇచ్చి నిన్న ఉదయం పెళ్లి చేశారు. అయితే లాక్ డౌన్ అవ్వడం వల్ల వారి వివాహం అతి కొద్దీ మంది సన్నిహితుల మధ్య జరిగింది. ఇంకా ఈ పెళ్లి జరిగే సమయంలోనే పెళ్లికూతురు, పెళ్ళికొడుకు మధ్య గొడవ జరిగింది. అయితే బంధువులు కలిసి ఇద్దరికీ సర్ది చెప్పారు. దీంతో ఆ గొడవ కాస్త సద్దుమణిగింది. ఇంకా వారిని ఇంటికి తీసుకువచ్చి తొలి రాత్రికి సిద్ధం చేశారు. 

 

అయితే వధూవరులను గదిలోకి పంపించారు. అయితే గదిలో కూడా మళ్లీ గొడవపడ్డారు. దీంతో కోపానికి గురైన వరుడు వధువు సంధ్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడనుంచి పరార్ అయ్యాడు. అయితే తెల్లారి ఎంత సమయం అయినా సరే ఇద్దరు భయటకు రాకపోవడంతో తలుపులు తీసి చూడగా వధువు సంధ్య చనిపోయి ఉండటాన్ని చూశారు.. అయితే ఆ గది నుండి పారిపోయిన అతడు కూడా గ్రామంలో ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బంధువులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుకు చేపట్టారు.                             

మరింత సమాచారం తెలుసుకోండి: