అక్రమ సంబంధాలు పచ్చని సంసారాలను నాశనం చేస్తున్నాయి. ఐదు నిమిషాల సుఖం కోసం కక్కుర్తి పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు మగవాళ్ళు మరొక ఆడదాని మోజులో పడి జీవితాలను నాశనం చేసుకునేవారు.కానీ ఇప్పుడు ఆడవాళ్ళూ మరొక మగాడితో శారీక సుఖాన్ని కోరుకొని కుటుంబాన్ని వదిలేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. 

 

 


వివరాల్లోకి  వెళితే.. తన భార్యకు మాయ మాటలు చెప్పి తీసుకుపోయిన వ్యక్తిని భర్త దారుణంగా చంపేసిన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. డీజే హళ్లి ప్రాంతానికి చెందిన తబ్రేజ్ అనే వ్యక్తి భార్యతో కలిసి ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సుభాన్ అనే యువకుడు తబ్రేజ్‌ భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ఇద్దరూ కలిసి వేరే ప్రాంతానికి పారిపోయారు. భార్య ఆచూకీ కనిపెట్టిన తబ్రేజ్ ఆమెకు నచ్చజెప్పి తన ఇంటికి తీసుకొచ్చాడు. 

 

 

అయితే ఆమె ఇంటికి వచ్చిన కూడా ప్రియుడు ద్యాస నుంచి బయటకు రాలేక పోయింది. సుభాన్‌తో సంబంధం కొనసాగిస్తూనే ఉంది.దీంతో భార్యను తనకు కాకుండా చేసిన సుభాన్‌పై తబ్రేజ్ కక్ష పెంచుకున్నాడు. అతడిని చంపేయాలని నిర్ణయించుకుని తన ఇద్దరు స్నేహితులతో కలిసి అతడిని మే నెలలో తుమకూరులో కిడ్నాప్ చేసి బెంగళూరుకు తీసుకొచ్చారు. తర్వాత హింసించి దారుణంగా చంపేశాడు.

 

 


అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్స్‌డేటా ఆధారంగా తబ్రేజ్‌ భార్యను అదుపులోకి తీసుకుని విచారించారు. తనకు సుభాన్‌తో అక్రమ సంబంధం ఉందని, ఓసారి అతడితో పారిపోయానని, ఆ కక్షతో భర్తే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది.దాంతో తబ్రేజ్ ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయాన్ని చెప్పేసాడు. కేవలం అతన్ని చంపడమే కాదు. అతని రక్తాన్ని కూడా తాగినట్లు చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు. ఈ హత్యకు సహకరించిన తబ్రేజ్ స్నేహితులను కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: